ప్ర‌భాస్ ఫ్యాన్స్ కు మ‌రో క్రేజీ అప్ డేట్‌

Update: 2022-03-14 15:30 GMT
`బాహుబ‌లి`తో ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఈ మూవీ అందించిన క్రేజ్ తో వ‌రుసగా అదే స్థాయి చిత్రాల్లో న‌టిస్తున్నారు. ఇటీవ‌ల ప్ర‌భాస్ న‌టించిన `రాధేశ్యామ్‌` కూడా పాన్ ఇండియా మూవీనే. తెలుగు నేటి విటీకి భిన్నంగా చేసిన సినిమా ఇది. ఇటీవ‌ల మార్చి 11న వ‌ర‌ల్డ్ వైడ్ గా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ ని రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టిస్తోంది. టాక్ కొంత మిక్స్డ్ గా వున్నా వ‌సూళ్లు రికార్డు స్థాయిలో వుండ‌టంతో ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ఈ మూవీ స‌క్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ మూవీ త‌రువాత బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు ప్ర‌భాస్ ఆయ‌న న‌టిస్తున్న సలార్‌, ఆది పురుష్‌, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ ..ఇవ‌న్నీ పాన్ ఇండియా మూవీసే. అయితే ఈ లైన‌ప్ చేసిన ఫ్యాన్స్ నేటివిటీ సినిమా ఏద‌ని, ప‌క్కా క‌మ‌ర్ష‌యల్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ప్ర‌భాస్ చేస్తే చూడాల‌ని ఫ్యాన్స్ చాలా రోజులుగా ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. అలాంటి స‌మ‌యంలో మారుతి నుంచి ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ వినిపించింది.

త్వ‌ర‌లో ప్ర‌భాస్ తో మారుతి ఓ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ని చేయ‌బోతున్నారంటూ గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని  డీవీవీ దాన‌య్య నిర్మివంచ‌బోతున్నార‌ట‌.

ప్ర‌భాస్ కూడా ఈ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ని, ఇందులో ప్ర‌భాస్ కు జోడీగా ముగ్గురు హీరోయిన్ లు న‌టించ‌నున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. `మాస్ట‌ర్‌` ఫేమ్ మాళ‌విక మోహ‌న‌న్‌, `పెళ్లిసంద‌D` లీల‌ని హీరోయిన్ లు గా ఇప్ప‌టికే ఫైన‌ల్ చేశాంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతే కాకుండా ఈ ప్రాజెక్ట్ ని త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టిస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

`రాధేశ్యామ్‌` త‌రువాత ఫ్యాన్స్ ప్ర‌భాస్ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ నేప‌థ్యంలో ఓ ఫ్యామిలీ ఎంట‌ర్ చేస్తే చూడాల‌ని భావిస్తున్నార‌ట‌. అందులో భాగంగానే మారుతితో ఈ ప్రాజెక్ట్ చేయ‌డానికి ప్ర‌భాస్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని చెబుతున్నారు. అన్నీ అనుకున్న‌ట్టుగా కుదిరితే ఈ సినిమాని ఏప్రిల్ నుంచి మారుతి సెట్స్ పైకి తీసుకెళ్లాల‌ని మాస్ట‌ర్ ప్లాన్ వేస్తున్నార‌ట‌. ఈ విష‌యం తెలిసి ప్ర‌భాస్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల‌వుతున్నార‌ట‌. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై ద‌ర్శ‌కుడు మారుతి ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చేశారు.

స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు అన్నీ బ‌య‌టికి వ‌చ్చేస్తాయ‌ని, అంత వ‌ర‌కు అంతా ఓపిక ప‌ట్టాల‌ని, ద‌ర్శ‌కుడిగా త‌న‌ని స‌పోర్ట్ చేస్తున్న వారంద‌రికి థ్యాంక్స్` అంటూ ఇటీవ‌ల మారుతి సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించ‌డం మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. మారుతి ప్ర‌స్తుతం హీరో గోపీచంద్ తో `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్` చిత్రాన్ని తెర‌కెక్కించారు. మారుతి మార్కు క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ చిత్రం త్వ‌ర‌లో విడుద‌లకు సిద్ధ‌మ‌వుతోంది.
Tags:    

Similar News