NTR31 లో మరో పాపులర్ స్టార్..?

Update: 2022-07-04 07:57 GMT
'ఆర్.ఆర్.ఆర్' చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. దీంతో ఇకపై పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులను అలరించే సినిమాలే చేయాలని నిర్ణయించుకున్నారు తారక్. ఈ నేపథ్యంలో కొరటాల శివ దర్శకత్వంలో NTR30 - ప్రశాంత్ నీల్ తో NTR31 చిత్రాలను లైన్ లో పెట్టారు.

'కేజీఎఫ్' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్.. ఇటీవల 'కేజీఎఫ్ 2' చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నమోదు చేశాడు. అలాంటి దర్శకుడు జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తుండటంతో అభిమానులు దీనిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. దీనికి తగ్గట్టుగానే తారక్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ కు విశేష స్పందన లభించింది.

అంతేకాదు ఇప్పటి నుంచే ఎన్టీఆర్ 31వ సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ - ఎలివేషన్ షాట్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో ఊహించుకుంటున్నారు. హీరోయిన్ గా ఎవరైతే బాగుంటుందని.. విలన్ గా ఫలానా నటుడైతే పెర్ఫెక్ట్ గా ఉంటుందంటూ మేకర్స్ సూచనలు చేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో మరో కీలక పాత్ర కూడా ఉంటుందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

హీరో పాత్రతో పాటుగా ప్రశాంత్ నీల్ మరో ప్రధాన పాత్రను ఇందులో క్రియేట్ చేసారని.. అది సినిమాలో హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తోందని అంటున్నారు. దీని కోసం విశ్వనటుడు కమల్ హాసన్ ను సంప్రదించారని.. 'విక్రమ్' భారీ సక్సెస్ తర్వాత సీనియర్ నటుడు స్పెషల్ రోల్స్ లో నటించాడని ఆసక్తి కనబరచడం లేదని టాక్ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ క్యారక్టర్ కోసం మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను సంప్రదించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కంప్లీట్ యాక్టర్ ఇంతకముందు 'జనతా గ్యారేజ్' సినిమాలో తారక్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రీ నిర్మాతలే NTR31 ను రూపొందిస్తున్నారు.

ఇప్పుడు మరోసారి మోహన్ లాల్ ను తమ ప్రాజెక్ట్ లో భాగం చేయాలని మేకర్స్ భావిస్తున్నారని అంటున్నారు. అయితే RRR సినిమాలో ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ కు ఎక్కువ క్రేజ్ వచ్చిందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తున్న తరుణంలో.. నందమూరి హీరో మళ్లీ మరో స్టార్ తో స్క్రీన్ పంచుకోడానికి అంగీకరిస్తారో లేదో.. అసలు ఇందులో నిజమెంతో చూడాలి.

కాగా, మాస్ అండ్ యాక్షన్ కు పెట్టింది పేరు యంగ్ టైగర్. హీరోయిజమ్ - ఎలివేషన్స్ చూపించడంలో ప్రశాంత్ నీల్ స్పెషలిస్ట్. ఇప్పుడు యాక్టింగ్ పవర్ హౌస్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ కలిసి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.

పాన్ ఇండియా స్థాయిలో మైత్రీ మూవీ మేకర్స్ మరియు నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ప్రశాంత్ నీల్ 'సలార్' సినిమా పూర్తైన తర్వాత ఈ ప్రాజెక్ట్ మీద ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు.
Tags:    

Similar News