ఇంకా సంఘమిత్ర సెట్టవ్వలేదు

Update: 2018-01-05 01:30 GMT

కోలీవుడ్ లో భారీ బడ్జెట్ తో సంఘమిత్ర అనే సినిమా తెరకెక్కడానికి రెడీగా ఉందని గత కొంత కాలంగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే సినిమా ఎనౌన్స్ మెంట్ చేసి నెలలు గడుస్తున్నా ఇంకా పట్టాలెక్కలేదు. మొదట్లో సినిమా మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కానుందని గత ఏడాది హైప్ బాగానే క్రియేట్ చేశారు. ఫైనల్ గా సినిమాలో లీడ్ రోల్ లో శృతి హాసన్ కూడా సెలెక్ట్ అయ్యింది. కానీ కొన్ని రోజులకే సినిమా గురించి అనేక రూమర్స్ వెలువడ్డాయి.

శృతి హాసన్ స్క్రిప్ట్ విధానం నచ్చలేక సినిమా నుంచి తప్పుకుందని వార్తలు వచ్చాయి. అయితే అది నిజమని తేలింది కూడా. ఇక సంఘమిత్ర లాంటి హిస్టారికల్ కథలో హీరోయిన్ గా ఎవరిని సెలెక్ట్ చేస్తారా అని ఎదురుచూడగా లిస్ట్ లోకి దిశా పటాని నేమ్ వచ్చింది. అందరు అదే ఫైనల్ అనుకున్నారు. చిత్ర యూనిట్ కూడా ఎన్ని రూమర్స్ వచ్చినా స్పందించలేదు. పైగా కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అసలే దిశా కొత్త హీరోయిన్ అని కథలో టైటిల్ రోల్ కి న్యాయం చేయగలుగుతుందా అనే సందేహాలు చాలానే వెలువడ్డాయి.

అయితే మొత్తానికి ఆమె ఫిక్స్ అయ్యిందని కోలీవుడ్ లో కూడా అనేక వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం అందులో ఎవరు సలెక్ట్ కాలేదని చిత్ర నిర్మాతల్లో ఒకరైన సి.కళ్యాణ్ తెలియజేశారు. రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఈ ఏడాదిలో సినిమా స్టార్ట్ అవుతుందని సమాచారం. అయితే సినిమాలో ఇంకా ఏ హీరోయిన్ ని సలెక్ట్ చేయలేదు. రూమర్స్ వస్తున్నా కూడా దర్శకుడు ఖండించలేదు. మరి ఈ సినిమా ఏ స్థాయిలో పట్టాలెక్కుతుందో చూడాలి.     


Tags:    

Similar News