ఎట్టకేలకు మెగాస్టార్ మీడియా ముందుకొస్తున్నారు

Update: 2019-10-02 16:44 GMT
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహ రెడ్డి' ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్ షోల నుండే సినిమా పాజిటీవ్ టాక్ అందుకొని బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తుంది. ఇప్పటికే ఇండస్ట్రీలో ప్రముఖులు 'సైరా' చూసి తమ అనుభూతులను పంచుకుంటూ మెగాస్టార్ అండ్ టీం కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాజమౌళి - మహేష్ లు కూడా సినిమా చూసి ట్విట్టర్ లో స్పందన తెలియజేసారు.

అయితే ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా రేపు ఎట్టకేలకు తెలుగు మీడియా ముందుకు వస్తున్నారు చిరు. సినిమా మొదలైనప్పటి నుండి ఇంత వరకూ సైరాకి సంబంధించి తెలుగులో ఒక్క ప్రెస్ మీట్ కి కూడా మెగాస్టార్ హాజరుకాలేదు. ముందు నుండి తెలుగులో చరణే ప్రమోషన్ లో పాల్గొంటూ వస్తున్నారు. రిలీజ్ కి ముందు రోజు కేవలం సాక్షి ఛానెల్ కి మాత్రమే ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 'సైరా'కి సాక్షి మీడియా పార్ట్నర్ అందుకే ఛానెల్స్ లో సాక్షితో మాత్రమే మాట్లాడారు.

రేపు తెలుగు మీడియాతో 'సైరా' సక్సెస్ ను పంచుకొని తద్వారా ప్రేక్షకులకు థాంక్స్ చెప్పబోతున్నాడు మెగాస్టార్. హైదరాబాద్ లో జరగనున్న ఈ ప్రెస్ మీట్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీడియా మీట్ కోసం ఓ స్టార్ హోటల్ లో స్లాట్ బుక్ చేశారు కూడా. మరి 'సైరా'కి సంబంధించి తొలి సారి తెలుగు మీడియా ముందుకు వస్తున్న చిరు రేపు ఈవెంట్ లో ఏం మాట్లాడతారో స్పీచ్ ఏ రేంజ్ లో ఉండబోతోందో తెలియాలంటే ఇంకొన్ని గంటలో ఆగాల్సిందే.
    

Tags:    

Similar News