భారతీయుడు సీక్వెల్ పై క్రేజీ అప్డేట్..!

Update: 2021-04-19 07:30 GMT
స్టార్ డైరెక్టర్ శంకర్ - విశ్వనటుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'భారతీయుడు-2'. 1996లో విడుదలై సంచలన విజయం అందుకున్న భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతుంది. అయితే దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ వస్తుండటం విశేషం. కానీ కమల్ - శంకర్ కాంబినేషన్ ఎప్పుడైతే ఈ సినిమా సీక్వెల్ ప్రారంభించారో అప్పటినుండి సినిమాకు అన్ని అవాంతరాలే. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాను కరోనా ప్రారంభంలో నిలిపేశారు మేకర్స్. అయితే మళ్లీ ఇంతవరకు సినిమా షూటింగ్ మొదలుకాలేదు. కానీ ఆ సినిమాను పక్కనపెట్టి డైరెక్టర్ శంకర్ రెండు సినిమాలు ప్రకటించాడు.

ఒకటి రాంచరణ్ తో పాన్ ఇండియా సినిమా, రెండోది బాలీవుడ్ హీరో రన్వీర్ సింగ్ తో అపరిచితుడు రీమేక్. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. అయితే శంకర్ కొత్త సినిమాలు ప్రకటించగానే భారతీయుడు-2 నిర్మాతలు తమ సినిమా ఎప్పుడు ఫినిష్ చేస్తావంటూ లీగల్ నోటిసులు పంపించారు. సినిమా ఆగిపోయిందని అందరూ అనుకుంటున్న తరుణంలో తాజాగా శంకర్ తరపు న్యాయవాది పరిస్థితులు అనుకూలించిన తర్వాత సినిమాను పూర్తి చేస్తామని చెప్పినట్లు సమాచారం. అంటే ఈ లెక్కన ఇంకా భారతీయుడు సీక్వెల్ ఆగిపోలేదని అర్ధమవుతుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పోస్టర్స్ వైరల్ అయ్యాయి. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్ గా నటిస్తుండగా.. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.
Tags:    

Similar News