బ్రేకప్ పై క్లారిటీ ఇచ్చిన రైటర్

Update: 2019-12-23 14:18 GMT
రెండు రోజుల నుండి దర్శకుడు త్రినాద్ రావు నక్కిన , రైటర్ ప్రసన్న కుమార్ విడిపోయారని, ఇకపై కలిసి సినిమా చేయడం లేదనే వార్త గట్టిగా చక్కర్లు కొడుతుంది. ఈ వార్తలతో ఇండస్ట్రీకి ఇద్దరూ హాట్ టాపిక్ అయ్యారు కూడా. నిజానికి 'హలో గురు ప్రేమ కోసమే' తర్వాత వీరిద్దరూ కలిసి మీడియా ముందుకు రాలేదు.  ఈవెంట్ లో కూడా విడివిడిగా కనిపిస్తున్నారు. ఇవి కూడా వార్తలకు బలం చేకూర్చాయి.

ప్రసన్న త్రినాద్ రావు నక్కిన తో బ్రేకప్ అయ్యాడని త్వరలోనే మెగా ఫోన్ పట్టి సినిమా చేస్తున్నాడనే టాక్ కూడా వినిపించింది. అయితే ఈ విషయంపై లేటెస్ట్ గా క్లారిటీ ఇచ్చాడు రైటర్ ప్రసన్న.  సామజిక మాధ్యమం ద్వారా తను చెప్పాలనుకున్నది చెప్పేసాడు.

నాలుగేళ్ల వరకూ డైరెక్షన్ అనే ఆలోచనే లేదని , ఇక త్రినాద్ రావు తో విడిపోయానని వస్తున్న వార్తల్లో నిజం లేదని, ప్రస్తుతానికి త్రినాద్ రావుతో కలిసి సినిమాకు వర్క్ చేస్తున్నాని వెల్లడించాడు. ప్రస్తుతం వీరిద్దరూ దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా కోసం కథను సిద్దం చేసే పనిలో ఉన్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ లో ఒకటి , పీపుల్ మీడియా బ్యానర్ లో మరొకటి కమిట్ అయ్యారట. ఈ సినిమాలు పూర్తయ్యాకే ప్రసన్న డైరెక్షన్ గురించి ఆలోచిస్తాడట.
Tags:    

Similar News