అల్లు అర్జున్ చేయాల్సిన సినిమా ప్రభాస్ చేతికి

Update: 2022-11-12 02:30 GMT
టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో అల్లు అర్జున్ తో పాటు ప్రభాస్ ఇద్దరు కూడా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్లుగా వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రభాస్ అయితే వరుసగా బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మరోవైపు బన్నీ పుష్ప అనే ఒక సినిమాతో ఒక ట్రెండ్ సెట్ చేసి ఇప్పుడు సెకండ్ పార్ట్ తో అదే తరహాలో సక్సెస్ అందుకోవాలి అని రెడీ అవుతున్నాడు.

అయితే ఒకానొక సమయంలో ఈ ఇద్దరి మధ్యలో తెలియకుండానే ఒక పోటీ నడిచినట్లుగా తెలుస్తోంది. మొదట వీరు చేయాలని అనుకున్న సినిమా కోసం దర్శకుడు ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలని ఆలోచించాడట. ఆ దర్శకుడు మరెవరో కాదు జయంత్ సి పరాన్జీ. జయంత్ దర్శకత్వంలో ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా వచ్చి నేటికీ 20 ఏళ్ళు కావస్తోంది.

ఒక విధంగా ప్రభాస్ వెండితెరపై కనిపించి కూడా నేటితో 20 ఏళ్లు పూర్తయింది. ఇక ఆ సినిమా విశేషాల గురించి మాట్లాడిన జయంత్ మొదట ఈ సినిమా కోసం మరొక హీరోను కూడా అనుకున్నట్లు చెప్పాడు. అయితే ఆయన కరెక్ట్ గా అల్లు అర్జున్ పేరు అయితే చెప్పలేదు కానీ ఒక ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్న హీరోని సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నప్పుడు ప్రభాస్ ఫోటో కూడా పక్కన పెట్టుకొని చూసామని అన్నారు.

అయితే ఇద్దరిలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నప్పుడు ప్రభాస్ ఐతే ఈ మాస్ కథకు కరెక్ట్ గా సెట్ అవుతాడని అనిపించింది అని జయంత్ చెప్పాడు. ప్రభాస్ కు మొదట ఈ కథ గురించి పెద్దగా చెప్పలేదని కేవలం మెయిన్ పాయింట్ చెప్పడంతోనే అతను పూర్తిగా తనపై నమ్మకం పెట్టుకొని సినిమాలో నటించినట్లుగా కూడా ఆయన చెప్పాడు.

ఇక అల్లు అర్జున్ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు మొదట చాలా కధలను మిస్ చేసుకున్నాడు. ఇక అనుకోకుండా ఈశ్వర్ కథ కూడా అతనికి మిస్ అయింది. మొదట అతను రాఘవేంద్రరావు దర్శకత్వంలో గంగోత్రి అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News