సుశాంత్ మేనేజర్ దిశ కేసులో ట్విస్ట్

Update: 2020-08-14 09:50 GMT
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ మేనేజర్ దిశా సలియన్ ఆత్మహత్య కేసులో తాజాగా ముగ్గురు వ్యక్తులపై ఫిర్యాదు దాఖలైంది. దిశా తండ్రి సతీష్ ఈ కేసు పెట్టారు. తమ కూతురు మరణంపై పుకార్లు వ్యాప్తి చేసినందుకు గాను ఈ ముగ్గురు వ్యక్తులపై శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై పోలీసులు వేగంగా స్పందించారు. విచారణను వేగవంతం చేశారు.

కొంతమంది సుశాంత్ మరణాన్ని దిశా మరణంతో కలిపి అనేక వాట్సాప్ ఫార్మర్డ్ మెసేజ్ లు - సోషల్ మీడియా పోస్టులు చేస్తున్నారు. వీళ్లిద్దరి మరణం కేసుల మధ్య సంబంధం ఉందంటున్నారు.

ఈ క్రమంలోనే దిశా తండ్రి ఓ ముగ్గురు వ్యక్తులు తమ కుమార్తె దిశ పరువు తీశారని.. ఆమె గురించి పలు పుకార్లు సృష్టించారని సతీష్ సలియన్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా పోస్టులు తమను మానసికంగా వేధిస్తున్నాయని విన్నవించారు.

దీంతో పోలీసులు పునీత్ వసిష్ట - సందీప్ మలాని - నమన్ శర్మలపై కేసులు పెట్టారు. ఐటీచట్టం - ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ ఐఆర్ నమోదు చేస్తామని తెలిపారు.
 
Tags:    

Similar News