బెల్లంకొండ సాక్ష్యానికి బంపర్ ఆఫర్!

Update: 2018-07-21 16:23 GMT
కోర్టులో సాక్ష్యాలకు ఎంతో విలువ ఉంటుంది..  సరైన సాక్ష్యం దొరికితే తిమ్మిని బమ్మిని చెయ్యొచ్చు కదా.  ఇదంతా కోర్టుల్లో.  మరి 'సాక్ష్యం' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాకు కూడా అలానే చాలా చాలా విలువ ఉన్నట్టుగా ఉంది.  అందుకే బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ అయిన ఈరోస్ ఇంటర్నేషనల్ 'సాక్ష్యం' సినిమాకు సంబంధించిన అన్ని హక్కులని గంపగుత్తగా.. ఇంకో తెలుగు పదంలో అందంగా చెప్తే 'టోకుగా' కొనుగోలు చేసిందట. తెలుగొద్దు ఇంగ్లిష్ ముద్దు అంటే హోల్ సేల్ అనే పదం ఎలాగూ ఉంది కదా.

కానీ ఆ హోల్ సేల్ రేటు ఎంతో మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఈరోస్ తెలుగు సినిమాల  హక్కులను కొనుగోలు చేయడం ఇది మొదటిసారేమీ కాదు. ఇప్పటికే చాలా తెలుగు సినిమాల హక్కులని కొని భారీ స్థాయిలో రిలీజ్ చేసింది.  మరి ఈ ఈరోస్ కు మన బెల్లంకొండ బాబుకి లంకె ఎక్కడ కుదిరింది?  ఆ లింక్ మాత్రం బెల్లంకొండ బాబుది కాదట.. ప్రొడ్యూసర్ అభిషేక్ నామాదట.  అభిషేక్ కు బాలీవుడ్ కార్పొరేట్ ప్రొడక్షన్ హౌసెస్ అయిన  ఈరోస్, ఫాక్స్ స్టార్ వంటి వాటితో గట్టి సంబంధాలున్నాయట.  దీంతో  వారు 'సాక్ష్యం' కంటెంట్ చూసి ముచ్చటపడి మరీ మొత్తం హక్కులు తీసుకున్నారట. 

ఈ సినిమాలో శ్రీనివాస్ కు జోడీగా డీజే బ్యూటీ పూజా హెగ్డే నటిస్తోంది.   శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. కుదిరితే రెడీగా ఉండండి. వీలయితే బెల్లంకొండ బాబును మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి.
Tags:    

Similar News