లేడీ ఫ్యాష‌న్ డిజైన‌ర్ అనుమానాస్ప‌ద మృతి

Update: 2022-06-11 14:57 GMT
గ‌త ఏడాది సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణం అనుమానాస్ప‌దం అయ్యింది. అత‌డు త‌న గ‌దిలో ఉరి వేర‌సుకుని మ‌ర‌ణించిన‌ట్టు పోలీసులు ధృవీక‌రించినా ఇప్ప‌టికీ ఇది మిస్టీరియ‌స్ డెత్ గానే ప‌రిగ‌ణించ‌బ‌డుతోంది. ఈ కేసుపై మూడు ఏజెన్సీలు అదే ప‌నిగా విచారించి చివ‌రికి నిజాల్ని నిగ్గు తేల్చ‌లేక‌పోయాయి.

ఇప్పుడు టాలీవుడ్ లో అలాంటి అనుమానాస్ప‌ద మ‌ర‌ణం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌ముఖ‌ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల అనుమానాస్పదంగా మృతి చెందారు. బంజారాహిల్స్ లోని తన అపార్ట్ మెంట్ లో ప్రత్యూష శవమై కనిపించింది. ఆమె గదిలో కార్బన్ మోనాక్సైడ్ బాటిల్ ఉంది.

ప్రత్యూష ఆవిరితో పాటు కార్బన్ మోనాక్సైడ్ ను పీల్చిందని దీని వల్ల ఆమె చనిపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు. ప్రత్యూష డిప్రెషన్ లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

తన బాత్ రూమ్ లో బొగ్గు ఆవిరితో ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. అయితే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఆమె కుటుంబసభ్యులు స్నేహితులకు సమాచారం అందించారు.

ప్రత్యూష అమెరికాలో ఫ్యాషన్ డిజైనింగ్ చదివి హైదరాబాద్ లో కెరీర్ ప్రారంభించింది. ఆమె 2013లో తన పేరు మీద ఒక లేబుల్ ని ప్రారంభించింది. కెరీర్ ప‌రంగా వెనుదిరిగి చూసేది లేదు.

ఆమె టాలీవుడ్ బాలీవుడ్ లో చాలా మంది ప్రముఖ సెల‌బ్రిటీల కోసం ప్ర‌త్యూష‌ పనిచేసింది. ఆమె ఖాతాదారులలో చాలా పెద్ద పేర్లు ఉన్నాయి. అనుమానాస్ప‌ద మ‌ర‌ణాలు ఎల్ల‌పుడూ విచార‌క‌రం. యువ ప్రతిభావ‌ని అకాల మరణం క‌ల‌చివేస్తోంది. ఇది ఆత్మ‌హ‌త్య‌నా కాదా? అన్న‌ది పోలీసులే తేల్చనున్నారు.
Tags:    

Similar News