ఎన్టీఆర్ ని ఆకాశానికి ఎత్తేస్తున్న పవర్ స్టార్ ఫ్యాన్స్..!

Update: 2022-11-02 05:14 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. గొప్ప నటుడే కాదు మంచి మనిషి కూడా. తానొక స్టార్ హీరో అనే బిల్డప్ ఇవ్వకుండా డౌన్ టూ ఎర్త్ పర్సన్ గా ఉంటాడు. ఏదైనా ఈవెంట్ లో తారక్ ని చూస్తేనే ఆ విషయం అర్ధమవుతుంది. అంతేకాదు ఎదుటి వారికి రెస్పెక్ట్ ఇవ్వడంలో ముఖ్యంగా మహిళలకు రెస్పెక్ట్ ఇవ్వడంలో ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా అన్నట్టు ఉంటుంది.

లేటెస్ట్ గా మరోసారి ఆ విషయం ప్రూవ్ అయ్యింది. కర్ణాటక రాజ్యోత్సవ్ సందర్భంగా దివంగత హీరో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కి కర్ణాటక రత్న అవార్డ్ ని ప్రకటించి ఆయన ఫ్యామిలీకి అది అందచేశారు.   

ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్, రజినీకాంత్ చీఫ్ గెస్టులుగా అటెండ్ అయ్యారు. ఈ ఈవెంట్ జరుగుతుండగానే అక్కడ వర్షం పడ్డది. వర్షం పడినా సరే అభిమానులు ఆ వేడుకని సక్సెస్ చేశారు. రాజ్ కుమార్ ఫ్యామిలీ అభిమానుల సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరిగింది.

ఇక వర్షం కారణంగా అతిథులు కూర్చునే కుర్చీల మీద కొంత తడి ఉంది. ఈ క్రమంలో పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని కూర్చుంటున్న టైం లో చెయిర్ ని తుడిచాడు ఎన్టీఆర్. అంతేకాదు ఇన్ఫోసిస్ చైర్ పర్సన్ సుధామూర్తిని కూడా ఆప్యాయంగా పలుకరించాడు ఎన్టీఆర్.

ఈ వీడియో వైరల్ అవడంతో తమ హీరో భార్యకు ఎన్టీఆర్ ఇచ్చిన రెస్పెక్ట్ ని చూసి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. మహిళల పట్ల ఎన్టీఆర్ కి ఉన్న గౌరవానికి హ్యట్సాఫ్ అనేస్తున్నారు. ఇక ఈ వేడుకలో మాట్లాడిన ఎన్టీఆర్.. ఇక్కడకు ఓ నటుడిగా రాలేదని.. పునీత్ రాజ్ కుమార్ స్నేహితుడిగా వచ్చానని.. యుద్ధం చేయకుండానే రాజ్యాన్ని గెలిచిన వ్యక్తి పునీత్ రాజ్ కుమార్ అని.. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అన్నది ఆయన చేసిన పనులను బట్టి తెలుస్తుందని అన్నారు ఎన్టీఆర్. రాజ్ కుమార్ కుటుంబం తన మీద చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు చెప్పారు.

తన స్పీచ్ మొత్తం కన్నడలోనే ఇచ్చిన ఎన్టీఆర్ ని అక్కడ సినీ ప్రేక్షకులు మరింత ఓన్ చేసుకున్నారని చెప్పొచ్చు.  కర్ణాటక రాజ్యోత్సవ్ వేడుకకు సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా గెస్ట్ గా అటెండ్ అయ్యారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Full View


Tags:    

Similar News