ఫోటో స్టొరీ: మహర్షి ప్రాంగణం.. దేవాగమనం!

Update: 2019-02-13 12:33 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు తన కొత్త సినిమా 'మహర్షి'ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నాడు.  ఏప్రిల్ నెలాఖరులో రిలీజ్ పెట్టుకున్నారు కాబట్టి పెద్దగా గ్యాప్ తీసుకోకుండా షూటింగ్ పూర్తి చేస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో ప్రస్తుతం జోరుగా సాగుతోంది.  ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ సారధ్యంలో ఒక ఫైట్ సీక్వెన్స్ ను తెరకేక్కిస్తున్నాడట దర్శకుడు. ఇదిలా ఉంటే 'మహర్షి' సెట్ కు అతిథుల తాకిడి జోరుగా ఉందట.

'మహర్షి' తో పాటు ఆర్ఎఫ్సీ లో 'భారాతే' అనే కన్నడ సినిమా షూటింగ్ జరుగుతూ ఉందట.  ఆ సినిమా హీరో శ్రీమురళి.. సీనియర్ నటుడు సాయి కుమార్ ఇద్దరూ ఈరోజు ఉదయం 'మహర్షి' సెట్ వద్దకు వచ్చి మహేష్ ను కలిసి కాసేపు ముచ్చటించారు.  ఇదిలా ఉంటే మహేష్ ను కలవడానికి వారిద్దరి తర్వాత మరో అతిథి కూడా వచ్చాడట.  ఆయన ఎవరంటే తమిళ హీరో కార్తి.  వాలెంటైన్ డే సందర్భంగా రిలీజ్ అవుతున్న తన కొత్త సినిమా 'దేవ్' ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన కార్తి 'మహర్షి' సెట్ కు వచ్చి మహేష్ ను.. దర్శకుడు వంశీ పైడిపల్లిని కలిసి ముచ్చటించాడు.

కార్తి గతంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఊపిరి' సినిమాలో నాగార్జున తో కలిసి నటించిన సంగతి తెలిసిందే.  వంశీతోనే కాకుండా మహేష్ బాబు కూడా కార్తికి మంచి ఫ్రెండ్ అని సమాచారం.  కార్తి.. మహేష్ ఇద్దరూ స్కూల్ మేట్స్ కావడంతో ఇద్దరికీ ముందు నుంచే పరిచయం ఉందట.  


Tags:    

Similar News