మైనింగ్ కింగ్‌ వారసుడికి వాటిపై కంటే సినిమాలపైనే మోజు ఎక్కువట

Update: 2022-12-21 07:30 GMT
బళ్లారి మైనింగ్ కింగ్.. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన్‌ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెల్సిందే. కన్నడ తో పాటు తెలుగు లో ఏక కాలంలో ఈయన హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు గాను సిద్ధం అయ్యాడు. ఈయన హీరోగా పరిచయం కాబోతున్న సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ఇటీవలే మొదలు అయ్యాయి.

భారీ ఎత్తున పూజా కార్యక్రమాలతో మొదలు అయిన ఈ సినిమా కు జూనియర్ అనే టైటిల్ ను ఖరారు చేశారట. భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్‌ తో రూపొందుతున్న జూనియర్ సినిమాలో కిరీటి లుక్ కు మంచి స్పందన వచ్చింది.

వారసత్వంతో డబ్బులతో వస్తున్న హీరో కనుక ఎలా ఉంటాడో అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ హీరోగా కిరటీ లుక్ పరంగా మంచి మార్కులు దక్కించుకున్నాడు.

ఇక కిరీటి యొక్క సినీ రంగ ప్రవేశం గురించి ఆయన తండ్రి గాలి జనార్థన్‌ రెడ్డి ఇటీవల ఒక మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా మాట్లాడుతూ తన కొడుకు కిరీటికి రాజకీయాల కంటే కూడా ఎక్కువ ఆసక్తి సినిమాలపై ఉంది. అందుకే కిరీటిని హీరోగా పరిచయం చేస్తున్నామని రెడ్డి అన్నాడు. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇదే విషయాన్ని గతంలో చెప్పుకొచ్చారు.

కిరీటి హీరోగా రూపొందుతున్న ఈ సినిమా కు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తుండగా సెంథిల్ కుమార్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

ఈ సినిమా తో కిరీటిని తెలుగు మరియు కన్నడ భాషల్లో స్టార్‌ హీరోల సరసన నిలపాలని గాలి వారి ఫ్యామిలీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. మరి ఎంత వరకు అది సక్సెస్ అయ్యేనో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News