పవన్ కళ్యాణ్ అనుమతితోనే ఈ సినిమా చేస్తున్నా: స్టార్ డైరెక్టర్

Update: 2020-12-25 02:30 GMT
పవర్ స్టార్ 'వకీల్ సాబ్' సినిమా షూటింగ్ దశలో ఉండగానే తన తదుపరి చిత్రం పనులను శరవేగంగా మొదలుపెట్టాడు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి. పవన్ కళ్యాణ్ 26వ చిత్రం వకీల్ సాబ్ హిందీ నుండి రీమేక్ చేస్తుండగా ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. రాజకీయాల తర్వాత పవర్ స్టార్ రీఎంట్రీ ఇవ్వబోతున్న సినిమా కాబట్టి ప్రేక్షకుల అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. పవర్ స్టార్ నటించనున్న 27వ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాను ఏయం. రత్నం నిర్మిస్తుండగా.. ఈ సినిమా మొఘలుల సామ్రాజ్యంలోని ఒక బందిపోటు కథతో తెరకెక్కుతున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. డైరెక్టర్ క్రిష్ పవన్ కళ్యాణ్ సినిమాను పక్కన పెట్టి వేరే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాను కూడా కేవలం 45 రోజులలో పూర్తి చేస్తానని మాటిచ్చినట్లు తెలుస్తుంది. అయితే పవన్ సినిమా పక్కన పెట్టి వేరేది చేస్తున్నాడంటే.. అసలు ఏంటి విషయం అని అందరికి సందేహం కలిగే ఉంటుంది. ఇటీవల ఈ విషయం పై క్రిష్ ఒక షోలో క్లారిటీ ఇచ్చాడు. ఆహా ఓటిటిలో హీరోయిన్ సమంత హోస్ట్ గా వ్యవహారిస్తున్న షో సామ్ జామ్. ఈ షోలో పాల్గొన్న క్రిష్.. పవన్ సినిమాను ఆయన పర్మిషన్ తీసుకొనే పక్కన పెట్టినట్లు తెలిపాడు.

ఇక ప్రస్తుతం వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ లను హీరో హీరోయిన్లుగా పెట్టి క్రిష్ పల్లెటూరి నేపథ్యంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సందర్బంగా షోలో క్రిష్.. హీరోయిన్ రకుల్ ను పొగడ్తలతో ముంచెత్తాడు. రకుల్ చాలా డెడికేటెడ్ అండ్ పంక్చ్యువల్ అని అన్నాడు. అలాగే బాలకృష్ణ తర్వాత ఇంతటి టైం మెయింటైనింగ్ ఆమె దగ్గరే చూసినట్లు చెప్పుకొచ్చాడు. ఇక షోలో క్రిష్ తో పాటు పాల్గొన్న రకుల్ ఆయన మాటలకు తెగ మురిసిపోయింది. ఇక క్రిష్ పవన్ కాంబినేషన్ మూవీ ఎప్పుడు అంటే.. 45డేస్ ముగిస్తే ప్రారంభం అవుతుందని ఆయన షో ద్వారా చెప్పకనే చెప్పాడని ఫ్యాన్స్ హ్యాపీ అవుతున్నారు.
Tags:    

Similar News