మహేష్ హీరోయిన్ కి భయం తగ్గుతోందట

Update: 2016-03-03 13:30 GMT
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో 1నేనొక్కడినే సినిమాలో సందడి చేసిన క్రితి సనోన్.. ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లిపోయింది. దిల్ వాలే అంటూ కింగ్ ఖాన్ షారూక్ పక్కన నటించినా సక్సెస్ రాలేదు కానీ.. బాద్ షా ఎఫెక్ట్ తో క్రేజ్ మాత్రం బోలెడు వచ్చేసింది. ప్రస్తుతం ఈ చిన్నది రాబ్టా అనే మూవీకి సైన్ చేసింది.

రాబ్టాలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో కలిసి రొమాన్స్ చేయనుంది క్రితి సనోన్. అయితే ఈ మూవీ కేవలం కేవలం గ్లామరస్ గానే అడ్వంచరస్ గా ఉంటుంది. అందులో భాగంగా ఈ అమ్మడు కూడా బోలెడన్ని అడ్వంచర్లు చేయాల్సి వస్తుందట. వాటిలో నీటి అడుగున చిత్రీకరించే సన్నివేశాలు కూడా చాలానే ఉంటాయి. నిజానికి క్రితి సనోన్ కి వాటర్ అంటే చాలా భయం అట. ఇక అండర్ వాటర్ సన్నివేశాలంటే అమ్మో అనేస్తోంది. అయినా సరే ఈ మూవీలో రోల్ కోసం కష్టపడి స్విమ్మింగ్ నేర్చుకుంటోంది క్రితి. ప్రస్తుతం రోజు ఉదయం ఓ గంట, సాయంత్రం ఓ గంట స్విమ్మింగ్ లో స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటోంది.

కొన్ని రోజులుగా స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తుండడంతో.. క్రితికి నీరు అంటే భయం నెమ్మదిగా తగ్గుతోందట. ముందు పడ్డంత టెన్షన్ ఇప్పుడు లేదని అంటోందీమె. త్వరలో సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు సై అంటానని కూడా చెబ్తోంది. ఇక అండర్ వాటర్ సీన్స్ మాత్రమే కాకుండా.. ఈ మూవీలో హార్స్ రైడింగ్ కూడా ఉంటుందట. పనిలో పనిగా గుర్రమెక్కడం కూడా నేర్చేసుకుంటోంది క్రితి సనోన్.
Tags:    

Similar News