వీడియో : లైగర్‌ ఓటీటీ.. కన్నీళ్లు పెట్టుకున్న ఛార్మి

Update: 2022-08-18 02:30 GMT
రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ సినిమాను వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల జోరు పెంచారు. ముంబయి లో గత రెండు వారాలుగా హడావుడి చేస్తున్న యూనిట్‌ సభ్యులు ఇప్పుడు తెలుగు మీడియా ముందుకు వచ్చారు.

తెలుగు మీడియాలో ఇంటర్వ్యూలతో తెగ హడావిడి చేస్తున్నారు. తాజాగా తెలుగు ప్రేక్షకుల కోసం హీరో విజయ్‌ దేవరకొండ మరియు దర్శకుడు పూరి తో నిర్మాతల్లో ఒకరు అయిన ఛార్మి ఇంటర్వ్యూ చేసింది.

ఛార్మి ఇంటర్వ్యూ చేయడంతో చాలా ఆసక్తికరంగా ఆ ఇంటర్వ్యూ అయ్యి ఉంటుందని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఇంటర్వ్యూ ప్రోమో ను విడుదల చేయడం జరిగింది.

పూర్తి ఇంటర్వ్యూను ఈనెల 19న అంటే రేపు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందిన లైగర్ సినిమా కరోనా సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా నిర్మాత ఛార్మి అన్నారు.

ఓటీటీ నుండి బిగ్ ఆఫర్ వచ్చిన సమయంలో అంటూ ఛార్మి కన్నీరు పెట్టుకుంది. ఓటీటీకి ఎందుకు ఇవ్వలేదు అనేది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.

సినిమా కోసం ఛార్మి.. పూరి ఇంకా అంతా కూడా ఎంతో కష్టపడ్డారు. ఇంటర్వ్యూలో ఆ విషయాలన్నింటిని కూడా చెప్పబోతున్నారు. విజయ్ దేవరకొండ కళ్లు కూడా చమర్చాయి. ఇంతకు అంతటి కష్టం ఎందుకు వచ్చింది... సినిమాను ఎందుకు ఓటీటీ ఇవ్వకుండా థియేటర్‌ రిలీజ్ కు అన్ని కష్టాల మధ్య తీసుకు వస్తున్నారు అనేది రేపు ఇంటర్వ్యూ స్ట్రీమింగ్ అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Full View

Tags:    

Similar News