ఆ ప్యాలెస్ లో గడిపిన మహేష్‌

Update: 2016-08-10 04:18 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో అందరికీ తెలిసిన విషయమే. తనకు ఏ మాత్రం గ్యాప్ దొరికినా కుటుంబంతో గడిపేందుకే ప్రిఫర్ చేస్తాడు. ప్రతీ అకేషన్ కి వెకేషన్ లాంటివి ప్లాన్ చేయడం కూడా మహేష్ స్పెషాలిటీ. ఇప్పుడు మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా.. భార్యాపిల్లలతోనే గడిపాడు సూపర్ స్టార్.

తండ్రి కృష్ణ ఆశీర్వాదం తీసుకున్నాక.. మిగిలిన రోజంతా భార్య నమ్రత.. కొడుకు గౌతమ్.. కూతురు సితారలకే కేటాయించడం విశేషం. బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవడం కోసం మురుగదాస్ తో చేస్తున్న సినిమా షూటింగ్ కి కూడా బ్రేక్ ఇచ్చేశారు. ఈ రెండు రోజులు ఎటువంటి హంగామా లేకుండా.. ఈవెంట్స్ లాంటి వాటికి హాజరు కాకుండా కేవలం తన భార్యా పిల్లలతోనే గడుపుతుండడం విశేషం. పుట్టినరోజు నాడు తాజ్ ఫలక్ నమా ప్యాలెస్ కు పిల్లలను తీసుకెళ్లి సంతోషంలో ముంచెత్తాడు మహేష్.

అక్కడి గ్రాండియర్ ను.. నోరూరించే రుచులను తను ఆస్వాదించి పిల్లలకు కూడా పంచిన మహేష్.. వారితో ఆడుకునేందుకే రోజులో ఎక్కువ సమయం కేటాయించాడు. తండ్రి పుట్టిన రోజున.. తండ్రితో రోజంతా ఆడుతూ గడిపే అవకాశం కంటే పిల్లలకు పెద్ద సెలబ్రేషన్ ఏముంటుంది చెప్పండి? ఏమైనా ఈ విషయంలో శభాష్ మహేష్ అనాల్సిందే.
Tags:    

Similar News