KGF డైరెక్ట‌ర్ ని మ‌హేష్ లాక్ చేశాడా?

Update: 2020-02-17 15:59 GMT
కేజీఎఫ్ - చాప్ట‌ర్ 1 సంచ‌ల‌నాల గురించి తెలిసిందే. ఈ సినిమా క‌న్న‌డంలో 100కోట్లు పైగా వ‌సూలు చేసింది. హిందీ స‌హా తెలుగులోనూ చక్క‌ని వ‌సూళ్లతో అద‌ర‌గొట్టింది. బాహుబ‌లి త‌ర్వాత మ‌ళ్లీ పాన్ ఇండియా కేట‌గిరీలో కేజీఎఫ్ సంచ‌ల‌నాల గురించే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది.

అందుకే కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తో సినిమాలు చేయాల‌న్న త‌హ‌త‌హ అన్ని ప‌రిశ్ర‌మ‌లో మొద‌లైంది. స్టార్ హీరోలు.. అగ్ర‌ నిర్మాత‌లు అత‌డిని బంగారు బాతులా చూస్తున్నారు. ప్ర‌శాంత్ నీల్ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేసి క‌లెక్ష‌న్లు కొల్ల‌గొట్టాల‌న్న తాప‌త్ర‌యం క‌న‌బ‌రుస్తున్నారు. ఇక ప్ర‌శాంత్ నీల్ సైతం తెలుగు స్టార్ హీరోలు.. స్టార్ ప్రొడ్యూస‌ర్ల నుంచి వ‌చ్చే ఆఫ‌ర్ల విష‌యంలో ఎంతో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఇప్ప‌టికే ప్ర‌శాంత్ నీల్ కి ప్ర‌భాస్- ఎన్టీఆర్- మ‌హేష్‌-చ‌ర‌ణ్ లాంటి స్టార్లు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌న్న ప్ర‌చారం సాగిపోయింది. వీళ్ల‌తో పాటు మైత్రి మూవీ మేక‌ర్స్- గీతా ఆర్ట్స్ లాంటి సంస్థ‌లు కేజీఎఫ్ ద‌ర్శ‌కుడిని వ‌దిలి పెట్ట‌డం లేద‌ని ప్ర‌చార‌మైంది.

ఆస‌క్తిక‌రంగా కేజీఎఫ్ డైరెక్ట‌ర్ తో ఎన్టీఆర్ సినిమాని నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని మైత్రి సంస్థ చాలా కాలం క్రితం ప్ర‌క‌టించింది. అప్ప‌ట్లోనే ఎన్టీఆర్ కి ప్ర‌శాంత్ లైన్ వినిపించార‌ని మైత్రి సంస్థ సినిమా చేసేందుకు సిద్ధంగా ఉంద‌ని ప్ర‌క‌టించారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌శాంత్ నీల్ తెలుగు హీరోకి ఫైన‌ల్ క‌మిట్ మెంట్ ఇచ్చార‌న్నది క‌న్ఫామ్ గా తెలియ‌డం లేదు.

తాజాగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ కి అత‌డు ఓ లైన్ వినిపించాడ‌ని.. అది న‌చ్చ‌డంతో బాస్ అల్లు అర‌వింద్ వ‌ద్ద‌కు అత‌డిని పంపించాడ‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. వాస్త‌వానికి మ‌హేష్ హీరోగా ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయాల‌న్న అర‌వింద్ ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైంది. దీంతో మ‌హేష్ తో మూవీ కోసం అర‌వింద్ ఏదో ఒక మంత్రాంగం న‌డిపిస్తూనే ఉన్నారు. ఆ ఇద్ద‌రికీ కామ‌న్ గా క‌థ చెప్పి ఒప్పించే మొన‌గాడు ఎవ‌రు? అంటే కేజీఎఫ్ డైరెక్ట‌ర్ అన్న మాటా ఇప్పుడు వినిపిస్తోంది. అయితే ప్ర‌శాంత్ ని నేరుగా అర‌వింద్ ద‌గ్గ‌రికి మ‌హేష్ పంపారు కాబ‌ట్టి అక్క‌డ క‌థ ఓకే కావాల్సి ఉంటుంది. అన్న‌ట్టు కేజీఎఫ్ 2 చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్న ప్ర‌శాంత్ నీల్ మ‌హేష్ కోసం ఎలాంటి కథ‌ను ఎంపిక చేసుకున్నాడు? అన్న‌ది  తెలియాల్సి ఉంది.  


Tags:    

Similar News