అల్లు కాంపౌండ్ నుంచి కొత్త సినిమా వచ్చేస్తోంది

Update: 2016-06-11 10:04 GMT
2014లో ‘పిల్లా నువ్వు లేని జీవితం’.. గత ఏడాది ‘భలే భలే మగాడివోయ్’.. ఈ సమ్మర్లో ‘సరైనోడు’.. అన్నీ ఒక బేనర్ నుంచి వచ్చిన సినిమాలే. అన్నీ లాభాలు మిగిల్చినవే. అల్లు అరవింద్ హవా ఎలా సాగుతోందో ప్రత్యేకంగా చెప్పాలా..? ఇప్పుడు అల్లు అరవింద్ బ్యాకప్ తో మరో ఆసక్తికర సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే.. మీకు మీరే మాకు మేమే. మూణ్నెల్ల ముందే ఉన్నట్లుండి వార్తల్లోకొచ్చిన ఈ చిన్న సినిమా.. ఆ తర్వాత చర్చల్లో లేకుండా పోయింది. సమ్మర్లో పెద్ద సినిమాల మధ్య ఎందుకన్నట్లు సినిమాను అట్టిపెట్టుకుని.. ఇప్పుడు సరైన టైమింగ్ చూసి విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

వచ్చే శుక్రవారమే ‘మీకు మీరే మాకు మేమే’ విడుదల కాబోతోంది. రిలీజ్ డేట్ ప్రోమోస్ కూడా వదులుతున్నారు. అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ బైట్ తో ఓ ఇంట్రెస్టింగ్ ప్రోమో కట్ చేసి.. ప్రమోషన్లు మొదలుపెట్టింది ‘మీకు మీరే మాకు మేమే’ టీమ్. శిరీష్ కాఫీ తాగుతుంటే.. డైరెక్టర్ బైట్ ఇవ్వమని అడగడం.. అతను ముందు పొడి పొడిగా ఒక్కో ముక్క మాట్లాడి.. చివరగా ఈ సినిమా గురించి లెంగ్తీగా చెప్పడం.. మొత్తంగా ఈ ప్రోమో ఆసక్తికరంగానే ఉంది. ‘నాన్నకు ప్రేమతో’కు కథ అందించిన హుస్సేన్ షా కిరణ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తరుణ్ శెట్టి అనే కొత్త కథానాయకుడు.. ‘మాయ’ ఫేమ్ అవంతిక జంటగా నటించారు. నాని సినిమా ‘జెంటిల్ మన్’కు పోటీగా వస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.
Full View

Tags:    

Similar News