ఆ డైరెక్టర్ తో 'థ్యాంక్ యూ' అనబోతున్న నాగచైతన్య

Update: 2020-04-29 16:26 GMT
అక్కినేని ఫ్యామిలీలో ప్రస్తుతం ఫామ్ లో ఉన్న హీరో ఎవరంటే మాత్రం.. నాగచైతన్య అనే చెప్పాలి. తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చైతుకి జోడిగా సాయిపల్లవి నటిస్తుంది. ఈ నెలలో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక నాగచైతన్య ఇటీవలే ఓ బేబీ సినిమాతో హిట్ అందుకున్న నందినీ రెడ్డితో ఒకటి, అలాగే గతంలో మనం వంటి అద్భుతమైన సినిమా తీసిన విక్రమ్ కె.కుమార్ డైరెక్టర్ తో ఓ సినిమా చేశాడట.

ఇక తాజాగా విక్రమ్ కె.కుమార్ తో చేయబోయే సినిమాకు 'థాంక్ యూ' అనే సింపుల్ టైటిల్ అనుకుంటున్నట్టు సమాచారం. విక్రమ్ ఇంతవరకు చేసిన సినిమాలన్నిటి టైటిల్స్ చాలా సింపుల్ గా ఉంటాయి. ప్రస్తుతం ఈ సినిమా ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ తయారు చేసే పనిలో పడ్డాడట విక్రమ్. కరోనా తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందట. మనం వంటి చరిత్రలో నిలిచిపోయే సినిమా తీసిన దర్శకుడు విక్రమ్ తరువాత ఆ స్థాయి హిట్ అందుకోలేదు. నిజానికి అసలు హిట్ అనేదే లేదు. కాబట్టి ఈ సినిమా ఆయనకు చాలా కీలకం కాబోతుంది. ఇక ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా.. ఈ సినిమా పై అక్కినేని అభిమానులలో భారీ అంచనాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
Tags:    

Similar News