'గరుడవేగ' దర్శకుడితో మూవీ ఫైనల్ చేసిన స్టార్ హీరో!!

Update: 2020-07-27 16:30 GMT
ప్రస్తుతం టాలీవుడ్ కింగ్ నాగార్జున తదుపరి సినిమాల విషయంలో స్పీడ్ పెంచాడు. ఇప్పటికే న్యూ డైరెక్టర్ సాల్మన్ దర్శకత్వంలో 'వైల్డ్ డాగ్' అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్న నాగ్.. తాజాగా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'రైడ్' రీమేక్ హక్కులు కూడా దక్కించుకున్నాడు. 2018లో అజయ్ దేవగన్ హీరోగా రూపొందిన రైడ్ సినిమా.. ఇన్కమ్ టాక్స్ కుంభకోణం నేపథ్యంలో సాగుతుంది. ఐటి శాఖలో జరుగుతున్న చీకటి కోణాలను బయట పెట్టే విధంగా.. నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమాకి డైరెక్టర్ కోసం వెతుకుతున్నాడు నాగ్. ఇదిలా ఉండగా.. ఇటీవలే గరుడవేగా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేయడానికి నాగ్ ఓకే చెప్పారు.

అయితే ఈ సినిమాను ఆసియన్ సినిమాస్ వారు కె నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావులతో పాటు శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇంకా టైటిల్ ఖరారు గాని ఈ ఈ యాక్షన్ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభించిస్తారని సమాచారం. ఇదిలా ఉండగా ప్రస్తుతం కథల విషయంలో నాగార్జున జాగ్రత్త వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవలే కొత్తగా యాభై కథలు విని.. ఐదు కథలు సెలెక్ట్ చేసాడట. అందులో ఫైనల్ ఏవి అనేది తెలియాల్సి ఉంది. గత కొంతకాలంగా నాగార్జునకు హిట్స్ లేక ఫామ్ కోల్పోయాడు. గతేడాది ఎన్నో ఆశలు పెట్టుకొని నటించిన మన్మధుడు-2 సినిమా ప్లాప్ అవ్వడంతో నాగార్జున తదుపరి సినిమాకోసం భారీ గ్యాప్ తీసుకున్నాడు. చూడాలి మరి ఈసారి మళ్లీ హిట్ కొట్టి ఫామ్ లోకి వస్తాడేమో..!
Tags:    

Similar News