అతుకుల కార్యక్రమం పూర్తయ్యింది

Update: 2017-05-05 04:09 GMT
'నాకు నచ్చినప్పుడే సినిమాను రిలీజ్ చేయిస్తా. ఏదేమైనా కూడా ఎవరేం అనుకున్నా కూడా సినిమాను నాకు నచ్చేవరకు ఎడిట్ చేయించి.. నచ్చినట్లు తీయించి.. వదులుతా' అంటూ సాక్షాత్తూ అక్కినేని నాగార్జున చెప్పేశారు. త్వరలో రానున్న నాగ చైతన్య కొత్త సినిమా ''రారండోయ్ వేడుక చూద్దాం'' గురించే ఈ రచ్చంతా. అయితే ఇప్పుడు అన్ని రకాల అతుకుల కార్యక్రమాలూ పూర్తయిపోయాయ్ తెలుసా!!

''సోగ్గాడే చిన్ని నాయనా'' సినిమాను తీసిన కళ్యాణ్‌ కృష్ణ డైరక్షన్లో.. ఇప్పుడు చైతన్య - రకుల్ - లావణ్య త్రిపాఠి లీడింగ్ రోల్స్ లో.. నాగార్జునే స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పైగా ఈ మధ్యన నాగ చైతన్య సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ప్రేమమ్ ఒక్కటే మనోడ్ని సేవ్ చేసింది. అందుకే కొడుకు కెరియర్ కు దగ్గరుండి కిక్ ఇచ్చేద్దాం అని డిసైడన నాగ్.. సినిమా ఔట్పుట్ తనకు నచ్చేవరకు తీయిస్తున్నారు. ఇప్పటికే చాలాసీన్లను రీషూట్లు.. కొన్ని పాటలకు అదనపు హంగులు.. వగైరా వగైరా చేయించారు. నిన్నటితో బ్యాలెన్స్ అనుకున్న ఆ రెండు పాటల చిత్రీకరణ కూడా పూర్తయ్యింది. ఎక్కడో ఫారిన్ లొకేషన్లో కాకుండా సింపుల్ గా కేరళలో ఈ పాటలను తీసేశారు. దీనితో సినిమా దాదాపు రెడీ అయ్యిందనే చెప్పాలి.

మరి కళ్యాణ్‌ కృష్ణ డైరక్షన్లో.. నాగార్జున ఇన్ డైరక్ట్ డైరక్షన్లో వస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుంది అంటారు? మే నెలాఖర్లోనే సినిమా రిలీజట. వెయిట్ చెయ్యండి అప్పుడు తెలుస్తుందిగా!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News