మహేష్ వియత్నాం వెళ్లిపోతున్నాడని..

Update: 2017-03-23 08:40 GMT
ఒకప్పుడు తన సినిమాల విషయంలో చాలా లేట్ చేసేవాడు మహేష్ బాబు. అతడితో సినిమా అంటే షూటింగ్ పూర్తవడానికి కనీసం ఏడాది పట్టేది. కానీ గత కొన్నేళ్లలో మహేష్ మారాడు. ‘ఖలేజా’ తర్వాత స్పీడు పెంచాడు. ఏ సినిమాకూ ఆరు నెలలకు మించి సమయం తీసుకోవట్లేదు. కానీ మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న లేటెస్ట్ మూవీ విషయంలో మాత్రం మహేష్ పాత స్టయిల్లో వెళ్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎనిమిది నెలల నుంచి జరుగుతోంది. మధ్య మధ్య చిన్న చిన్న బ్రేక్స్ మినహాయిస్తే సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. దీంతో ఒకప్పట్లా తన పిల్లలకు సమయం కేటాయించలేకపోతున్నాడు మహేష్.

అందులోనూ మురుగతో సినిమాను జూన్ 23న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాక మహేష్ నిర్విరామంగా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. దీంతో గౌతమ్.. సితార ఇద్దరూ మహేష్ ను బాగా మిస్సయిపోతున్నారు. కొన్ని రోజులుగా మహేష్ చెన్నైలోనే ఉండి షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ షెడ్యూల్ అవ్వగానే వియత్నాంలో కొత్త షెడ్యూల్ కోసం అట్నుంచి అటే విమానం ఎక్కేయనుంది మహేష్ అండ్ టీం. దీంతో హైదరాబాద్ నుంచి గౌతమ్.. సితారలను తీసుకుని చెన్నైకి బయల్దేరింది మహేష్ భార్య నమ్రత. చెన్నైకి చేరుకున్న అనంతరం సెల్ఫీ దిగి.. సోషల్ మీడియాలో షేర్ చేసింది కూడా. తమ ప్రియమైన తండ్రిని చూడకుండా పిల్లలిద్దరూ ఉండలేకపోతున్నారని ట్వీట్ చేసింది నమ్రత. పిల్లలతో కొంచెం సమయం గడిపాక వియత్నాం వెళ్లనున్నాడు మహేష్. అక్కడ పది రోజుల షెడ్యూల్ ముగించుకుని హైదరాబాద్ తిరిగిరానున్నాడు మహేష్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News