రాఖీ భాయ్ రేంజ్ హీరోయిజాన్ని తార‌క్ లో చూడొచ్చా?

Update: 2020-08-14 03:45 GMT
కేజీఎఫ్ త‌ర్వాత కేజీఎఫ్ 2 చిత్రీక‌ర‌ణ‌లో పూర్తి బిజీగా ఉన్నాడు ప్ర‌శాంత్ నీల్. ర‌ఫ్ అండ్ ఠ‌ఫ్ మాఫియా క‌థ‌ను ఎంచుకుని హీరోయిజాన్ని ఎలివేట్ చేయ‌డంలో అత‌డి ప్ర‌తిభ‌కు ముచ్చ‌ట‌ప‌డి వ‌రుస‌గా టాలీవుడ్ అగ్ర హీరోలు అవ‌కాశాలిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప్ర‌శాంత్ నీల్ కి ఎన్టీఆర్ .. ప్ర‌భాస్ లాంటి స్టార్ హీరోలు అవ‌కాశాలిచ్చారు. తొలిగా ఎన్టీఆర్ తో సినిమాని ప్ర‌శాంత్ నీల్ పూర్తి చేయాల్సి ఉంది.

అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్ప‌టికి సాధ్య‌మ‌వుతుంది? అంటే దానికి ఇన్నాళ్లు స‌రైన క్లారిటీ లేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం స్క్రిప్టు ప‌రంగా తార‌క్ కి ఓ క్లారిటీ వ‌చ్చేసింద‌ని తెలుస్తోంది. ప‌లుమార్లు వీడియో కాల్ ఇంట‌రాక్ష‌న్ లో తార‌క్ తో ప్ర‌శాంత్ నీల్ స్క్రిప్టు పై చ‌ర్చించారు.

ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ పూర్తి చేసుకుని అటుపై త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌నున్నాడు. ఆ సినిమా పూర్త‌వ్వ‌గానే కేజీఎఫ్ ద‌ర్శ‌కుడితో సెట్స్ కెళతాడు. 2021 ఎండింగ్ నాటికి దీనిపై క్లారిటీ వ‌చ్చేస్తుంది. అప్ప‌టికి త్రివిక్ర‌మ్ తో సినిమా పూర్త‌వుతుంది కాబ‌ట్టి 2022 ఆరంభంలో ఈ కాంబినేష‌న్ సినిమా ప‌ట్టాలెక్కే ఛాన్సుంటుంద‌ని భావిస్తున్నారు. 2022 నాటికి ప్ర‌శాంత్ నీల్ అన్ని క‌మిట్ మెంట్లు పూర్తి చేసుకుని ఎన్టీఆర్ కోసం రెడీ అయ్యే వీలుంద‌ట‌.

తారక్ కి ఈ మూవీ కూడా ప్ర‌తిష్ఠాత్మ‌కం కానుంది. అందుకే అత‌డి బాడీ లాంగ్వేజ్ కి త‌గ్గ‌ట్టు భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ని తెర‌కెక్కించేందుకు ఆస్కారం ఉంద‌ని తెలుస్తోంది. కేజీఎఫ్ రేంజ్ హీరోయిజాన్ని తార‌క్ లో చూడాల‌న్న త‌ప‌న నంద‌మూరి అభిమానుల‌కు ఉంది. మ‌రి ప్ర‌శాంత్ నీల్ అత‌డి పాత్ర‌ను ఏ రేంజులో తీర్చిదిద్దుతున్నారు? అన్న‌ది చూడాలి.


Tags:    

Similar News