అసిస్టెంట్ డైరెక్టర్ తో ప్రేమలో పడిందట

Update: 2017-04-09 09:14 GMT
బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా ఇప్పుడు బాగా స్లిమ్ గా తయారైపోయి భలే ఎట్రాక్టివ్ గా మారిపోయింది. అసలీ భామ బొద్దుగా ఉన్న రోజుల్లోనే.. పర్సనల్ లైఫ్ పై బోలెడన్ని రూమర్స్ వచ్చాయి. ఈ భామతో లేడీస్ వర్సెస్ రిక్కీ బహల్.. శుద్ధ్ దేశీ రొమాన్స్ చిత్రాలను తీసిన డైరెక్టర్ మనీష్ శర్మతో ప్రేమ వ్యవహారం నడిపిందని టాక్.

అయితే.. ఈ దర్శకుడితో విడిపోయిన తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లిపోయి.. దాన్నుంచి బయటపడ్డానికి ఫిట్నెస్ మంత్రాలను పఠించేసి.. ఇప్పుడు షేప్ లోకి వచ్చేసిందని అంటారు బాలీవుడ్ జనాలు. అయితే.. ఇప్పుడు మళ్లీ కెరీర్ ని ఫుల్ స్వింగ్ తో ప్రారంభించిన పరిణీతి.. మళ్లీ కొత్త లవ్ స్టోరీ స్టార్ట్ చేసేసిందట. ఈ సారి అసిస్టెంట్ డైరెక్టర్ తో ప్రేమలో పడిందని.. ఇద్దరూ కలిసి ముంబైలోని రెస్టారెంట్లు.. పబ్ లను తెగ చుట్టేస్తున్నారనే న్యూస్ బాగానే వినిపిస్తోంది.

రీసెంట్ గా తన ప్రేమ వ్యవహారంపై ఓ టైపులో రియాక్ట్ అయింది పరిణీతి. 'నేను డేటింగ్ చేస్తున్నానంటూ ఎప్పుడూ రూమర్స్ తిరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు అవి చచ్చిపోయి.. నేను బ్రేకప్ అయ్యానని కొత్తగా వేరేవి పుట్టుకొచ్చాయంతే' అంటోందీ భామ. ఇక లేటెస్ట్ లవ్ కహానీపై అయితే పరిణీతి నుంచి ఇంకా రియాక్షన్ రాలేదు. మరోవైపు ఈ భామ ఆయుష్మాన్ ఖురానాతో నటించిన మేరీ ప్యారీ బిందు మే 12న విడుదలకు సిద్ధమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News