ఓవైపు కరోనా సెకండ్ వేవ్ సినీకార్మికులకు కష్టం కలిగిస్తోంది. షూటింగులు బంద్ అయ్యి రిలీజ్ లు వాయిదా పడుతున్న పరిస్థితి. ఇక ఇటీవలి కాలంలో సహాయకులకు కరోనా సోకుతుండడంతో చాలా మంది టాలీవుడ్ అగ్ర కథానాయకులు స్వీయనిర్భంధంలోకి వెళ్లారు. రామ్ చరణ్ కూగా తన వ్యక్తిగత కారవ్యాన్ డ్రైవర్ మరణంతో ఆందోళనకు గురయ్యారు. ఆయన స్వీయనిర్భంధంలో ఉన్నారన్న టాక్ వినిపించింది.
ఇకపోతే మెగాస్టార్ తో చరణ్ త్రోబ్యాక్ ఫోటో ఒకటి ప్రస్తుతం అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఆ ఇద్దరూ కలిసి ఆచార్య చిత్రంలో నటిస్తున్నప్పటి ఫోటో ఇది. ఇంతకుముందు ఇరువురు గన్స్ పట్టుకుని నక్సల్స్ గెటప్పుల్లో కనిపించిన ఫోస్టర్ ని రిలీజ్ చేయగా దానికి అభిమానుల నుంచి గొప్ప స్పందన వచ్చింది. అలా రిలాక్స్ డ్ గా చైర్ లో కూచుని ఉన్న ఆ ఇద్దరినీ చూస్తుంటే.. గుబురుగా పెరిగిన ఆ గడ్డాలు గెటప్ చూస్తుంటే ఇంతకుముందు ఆచార్య షూటింగులో పాల్గొన్నప్పటి తీరిక వేళ మీటింగ్ ఇదని అర్థమవుతోంది.
చిరు ఇటీవలే షూటింగుకి బ్రేక్ ఇచ్చారు. మహమ్మారీ ఉధృతి వల్ల ఇంట్లోనే ఉంటున్నారు. ఇదే తీరిక సమయంలో సీసీసీ మిగులు నిధిని ఉపయోగించి కోవ్యాగ్జిన్ ను సినీకార్మికులకు అందజేస్తున్నారు. మొదటి డోస్ వేసే కార్యక్రమం ఇప్పటికే అపోలో సారథ్యంలో మొదలైంది. కొందరు సినీజర్నలిస్టులు కూడా వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. 45 వయసు దాటిన వారంతా తొలిగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఓ వీడియో చాట్ ని రిలీజ్ చేశారు. అన్నట్టు సెకండ్ వేవ్ కష్టం నుంచి కార్మికులు బయటపడేందుకు మునుపటిలా కనీస ఆహారభద్రతకు కూడా ఏదైనా చేస్తారేమో చూడాలి.
ఇకపోతే మెగాస్టార్ తో చరణ్ త్రోబ్యాక్ ఫోటో ఒకటి ప్రస్తుతం అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఆ ఇద్దరూ కలిసి ఆచార్య చిత్రంలో నటిస్తున్నప్పటి ఫోటో ఇది. ఇంతకుముందు ఇరువురు గన్స్ పట్టుకుని నక్సల్స్ గెటప్పుల్లో కనిపించిన ఫోస్టర్ ని రిలీజ్ చేయగా దానికి అభిమానుల నుంచి గొప్ప స్పందన వచ్చింది. అలా రిలాక్స్ డ్ గా చైర్ లో కూచుని ఉన్న ఆ ఇద్దరినీ చూస్తుంటే.. గుబురుగా పెరిగిన ఆ గడ్డాలు గెటప్ చూస్తుంటే ఇంతకుముందు ఆచార్య షూటింగులో పాల్గొన్నప్పటి తీరిక వేళ మీటింగ్ ఇదని అర్థమవుతోంది.
చిరు ఇటీవలే షూటింగుకి బ్రేక్ ఇచ్చారు. మహమ్మారీ ఉధృతి వల్ల ఇంట్లోనే ఉంటున్నారు. ఇదే తీరిక సమయంలో సీసీసీ మిగులు నిధిని ఉపయోగించి కోవ్యాగ్జిన్ ను సినీకార్మికులకు అందజేస్తున్నారు. మొదటి డోస్ వేసే కార్యక్రమం ఇప్పటికే అపోలో సారథ్యంలో మొదలైంది. కొందరు సినీజర్నలిస్టులు కూడా వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. 45 వయసు దాటిన వారంతా తొలిగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఓ వీడియో చాట్ ని రిలీజ్ చేశారు. అన్నట్టు సెకండ్ వేవ్ కష్టం నుంచి కార్మికులు బయటపడేందుకు మునుపటిలా కనీస ఆహారభద్రతకు కూడా ఏదైనా చేస్తారేమో చూడాలి.