మహేష్‌ పైనే ఆశలన్నీ పెట్టేసుకున్న బుట్టబొమ్మ

Update: 2023-01-05 12:30 GMT
పూజా హెగ్డే టాలీవుడ్‌ లో అలా పైకి ఎసిగి కింద పడ్డట్లు అయ్యింది. ఒక్కేసారి స్టార్‌ హీరోల అందరితో నటించే అవకాశాలు దక్కించుకుంది. అంతలోనే ఆఫర్లు లేకుండా పోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు లో నటిస్తున్న ఏకైక చిత్రం మహేష్ బాబు, త్రివిక్రమ్‌ ల కాంబినేషన్ లో రూపొందుతున్న SSMB28. ఆ సినిమా పైనే పూజా హెగ్డే ఆశలన్నీ ఉన్నాయి.

గత ఏడాది ఈమె చేసిన ఏ ఒక్క సినిమా కూడా ఆకట్టుకోలేకపోయాయి. బీస్ట్ కాస్త పర్వాలేదు అన్నట్లుగా ఉన్నా ఆ క్రెడిట్ ఈమెకు దక్కలేదు. ఇక ఆచార్య సినిమాలు ఈమెది మరీ చిన్న రోల్‌.. ఎఫ్‌ 3 లో చేసిన ఐటం సాంగ్‌ ఆకట్టుకున్నా సినిమా కమర్షియల్‌ గా నిరాశ పర్చింది. ఇక ఏడాది చివర్లో సర్కస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో పరాజయం ను తన ఖాతాలో వేసుకుంది.

పూజా హెగ్డే ప్రస్తుతం హిందీలో సల్మాన్ ఖాన్‌ తో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా లో ఈమె పాత్ర ఎంత ఉంటుంది.. ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఇక తెలుగు లో మహేష్ బాబు.. త్రివిక్రమ్‌ కాంబోలో నటించబోతుంది. ఇప్పటికే సల్మాన్ ఖాన్‌ సినిమా షూట్‌ ముగిసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్నది కేవలం SSMB28 మాత్రమే.

ఇప్పటికే అల వైకుంఠపురంలో సినిమాతో భారీ విజయాన్ని త్రివిక్రమ్‌ ఇచ్చిన కారణంగా మరోసారి ఆయన్ను పూజా హెగ్డే నమ్ముతుంది. మహేష్‌.. త్రివిక్రమ్‌ కాంబో సినిమా పై ఏ స్థాయిలో అంచనాలు.. ఆసక్తి ఉందో అందరికీ తెల్సిందే. కనుక ఈ సినిమా విషయంలో ఎక్కువ శ్రద్ద పెట్టాలని.. షూటింగ్ కు కావాల్సినన్ని డేట్లు ఇవ్వడంతో పాటు ప్రమోషన్‌ సమయంలో కూడా ఎక్కువ రోజులు మీడియా లో ఉండాలని భావిస్తుందట.

మహేష్ బాబుతో చేయబోతున్న ఈ సినిమా పూజా హెగ్డే కు చివరి అవకాశం అన్నట్లుగా సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ సినిమా హిట్ అయ్యి.. సినిమాలో మంచి పాత్ర తో అలరిస్తేనే ముందు ముందు పూజా హెగ్డే కు ఆఫర్లు వస్తాయి అనేది టాక్‌. మరి మహేష్ బాబు సినిమా తో పూజా హెగ్డే మరికొన్నాళ్లు ఇండస్ట్రీలో కంటిన్యూ అయ్యేనా చూడాలి.   




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News