స్టార్ హీరోయిన్ ప‌రిస్థితేంటీ ఇలా మారింది?

Update: 2022-10-17 11:33 GMT
టాలీవుడ్ లో ఒక‌ హీరోయిన్ ట్రాక్ లోకి వ‌చ్చిందంటే మిగ‌తా హీరోలు, స్టార్స్, డైరెక్ట‌ర్స్‌, ప్రొడ్యూస‌ర్స్ ఆ హీరోయిన్ వెంట‌ప‌డ‌టం, త‌మ సినిమాల్లో క్రేజీ ఆఫ‌ర్ల‌ని అందించ‌డం ఈ మ‌ధ్య కాలంలో కామ‌న్ గా మారింది. అయితే అలా క్రేజీ ఆఫ‌ర్ల‌ని సొంతం చేసుకున్న స‌ద‌రు స్టార్ హీరోయిన్ ల ప‌రిస్థితి క్రేజ్ త‌గ్గాక చిత్రంగా మారుతోంది. ఇప్ప‌డు ఇదే ప‌రిస్థితిని క్రేజీ హీరోయిన్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే ఎదుర్కొంటోంది. తెలుగులో 'డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌' త‌రువాత వ‌రుస ఆఫ‌ర్ల‌ని సొంతం చేసుకుంది.

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వ‌రుస క్రేజీ ఆఫర్ల‌ని సొంతం చేసుకుంటూ అంద‌రు అవాక్క‌య్యేలా చేసింది. 2017 నుంచి డీజేతో మొద‌లైన పూజా హెగ్డే క్రేజీ జ‌ర్నీ 2020లో బ‌న్నీ హీరోగా రూపొందిన 'అల వైకుంఠ‌పుర‌ములో' వ‌ర‌కు సాఫీగా సాగింది. 2020లో బ‌న్నీ - త్రివిక్ర‌మ్ ల క‌ల‌యిక‌లో విడుద‌లైన 'అల వైకుంఠ‌పుర‌ములో' మ్యూజిక‌ల్ గా మ్యాజిక్ చేసి ఇండ‌స్ట్రీ హిట్ అనిపించుకుంది. హీరోగా బ‌న్నీకి, హీరోయిన్ గా పూజా హెగ్డేకి మంచి క్రేజ్ ని స‌రికొత్త ఇమేజ్ ని తెచ్చిపెట్టింది.

ఈ మూవీతో బుట్ట‌బొమ్మ‌గా క్రేజ్ ని ద‌క్కించుకున్న పూజా హెగ్డే ఆ క్రేజ్ తో వ‌రుస క్రేజీ ఆఫ‌ర్ల‌ని సొంతం చేసుకుంది. అఖిల్ తో క‌లిసి న‌టించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌' ఫ‌ర‌వాలేద‌నిపించింది. అయితే ఆ త‌రువాత ప్ర‌భాస్ తో చేసిన 'రాధేశ్యామ్‌', విజ‌య్ కి జోడీగా న‌టించిన 'బీస్ట్‌', మెగాస్టార్ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన 'ఆచార్య‌' వంటి భారీ ప్రాజెక్ట్ లు బాక్సాఫీస్ వ‌ద్ద భారీ స్థాయి డిజాస్ట‌ర్ లుగా నిల‌వ‌డంతో బుట్ట‌బొమ్మ ప‌రిస్థితి కాస్త త‌ల‌కిందులైంది.

క్రేజీ ఆఫ‌ర్ల‌ని ద‌క్కించుకున్నా అవి బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన ఫ‌లితాన్ని రాబ‌ట్ట‌లేక‌పోవ‌డంతో పూజా క్రేజ్ క్ర‌మంగా త‌గ్గ‌డం మొద‌లైంది. 2022లో అయినా పూజా హెగ్డే కెరీర్ గాడిలో ప‌డుతుంద‌ని భావిస్తే అది జ‌ర‌గ‌డం లేదు. ప్ర‌స్తుతం తెలుగులో మ‌హేష్ బాబు తో త్రివిక్ర‌మ్ తెర‌కెక్కిస్తున్న మూవీలో న‌టిస్తోంది.

ఇటీవ‌లే షూటింగ్ మొద‌లైన ఈ మూవీ ఈ ఏడాది థియేట‌ర్ల‌లోకి రావ‌డం లేదు. మ‌రి వ‌చ్చే ఏడాది ఏప్రిల్ లో అయినా వ‌స్తుందా? అంటే మ‌హేష్ మ‌ద‌ర్ ఇందిరా దేవి మృతి కార‌ణంగా షూటింగ్ మ‌రింత ఆల‌స్యం అవుతోంది. అంతే కాకుండా మ‌హేష్ ప్ర‌త్యేక ట్రీట్ మెంట్ కోసం స్పెయిన్ వెల్ల‌డం తెలిసిందే.

ఇక స‌ల్మాన్ ఖాన్ తో హిందీలో చేస్తున్న 'కిసీకీ భాయ్ కిసీకీ జాన్‌' కూడా ఈ ఏడాది రావ‌డం లేదు. వ‌చ్చే ఏడాది ఈద్ కి రిలీజ్ చేయ‌బోతున్నారు. దీంతో ఈ ఏడాది పూజా హెగ్డే సినిమా థియేట‌ర్ల‌కు రావ‌డం క‌ష్టంగా మార‌డంతో త‌న‌కు 2022 పెద్ద‌గా క‌లిసి రావ‌డం లేద‌ని ఆమె ఫ్యాన్స్ వాపోతున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో ర‌ణ్ వీర్ సింగ్ తో చేస్తున్న 'స‌ర్క‌స్‌' 2022 డిసెంబ‌ర్ లో రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మూవీ అయినా పూజాని మ‌ళ్లీ ట్రాక్ లోకి తీసుకొస్తుందా? అని ఆమె ఫ్యాన్స్ అనుకుంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News