హీరోయిన్ గా కమెడియన్ డాటర్

Update: 2022-07-25 11:04 GMT
సినిమా ప్రపంచంలో వారసత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ రూట్లో సక్సెస్ అయిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. కేవలం బ్యాగ్రౌండ్ ఉంటేనే సరిపోదు మంచి టాలెంట్ ఉంటేనే ఎవరైనా నిలదొక్కుకుంటారు అని చాలాసార్లు రుజువు అయింది. ఇక కమెడియన్స్ ఫ్యామిలీకి చెందిన వారసులు కూడా సినిమా ప్రపంచంలో వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఇక 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ తో ఎంతగానో క్రేజ్ అందుకున్న కమెడియన్ పృథ్వి కూతురు కూడా త్వరలోనే హీరోయిన్ గా ఇండస్ట్రీలో బిజీ అవ్వాలని అడుగులు వేస్తోంది. గతంలోని పృద్వి తన పిల్లల సినిమా ఎంట్రీ విషయం గురించి ముందుగానే క్లారిటీ ఇచ్చాడు. ముఖ్యంగా తన కూతురు నటిగా ప్రత్యేకంగా గుర్తింపును అందుకోవాలని అనుకుంటుంది అని.. ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంది అని వివరణ ఇచ్చాడు.

కొత్త రంగుల ప్రపంచం అనే సినిమా ద్వారా పృథ్వీరాజ్ కూతురు శ్రీలు హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం కాబోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులన్నీ కూడా ఫినిష్ అయ్యాయి. త్వరలోనే సినిమా కూడా విడుదల కాబోతోంది.

ఇక ఈ సందర్భంగా నన్ను ఆదరించినట్లే నా కూతురుకి కూడా మీ సపోర్ట్ కావాలి అని పృథ్వీరాజ్ ఒక వీడియోలో వివరణ ఇచ్చాడు. తప్పకుండా ఈ సినిమా ఆమెకు మంచి గుర్తింపును లభిస్తుంది అని నటనలో అలాగే డ్యాన్స్ లో కూడా తన కూతురు ఎంతో శిక్షణ తీసుకుందని కూడా అన్నారు.

ఇక ఈ సినిమా ద్వారానే పృథ్వీరాజ్ సన్నిహిత స్నేహితుడు కుమారుడు క్రాంతి కూడా హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్ విషయంలో మరింత డోస్ పెంచాలని కూడా పృద్వి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక గతంలో రాజకీయ నాయకుడిగా కూడా పృద్వి తన అదృష్టాన్ని పరీక్షించుకున్న విషయం తెలిసిందే. ఇక మళ్ళీ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కూడా బిజీ అవ్వాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.
Tags:    

Similar News