#RRR : రాజమౌళి పదేళ్ల క్రితం ఊహించిందే నిజం అవుతోంది

Update: 2022-03-15 04:30 GMT
బాహుబలి వంటి భారీ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమా విడుదలకు సిద్ధమైంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా ఈ నెల 25 వ తారీకున విడుదల కాబోతున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా అదే చర్చ జరుగుతోంది.

ఈ సినిమా ను రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లతో రాజమౌళి తెరకెక్కించిన విషయం తెలిసిందే. రాజమౌళి ఏ సినిమాను చేసినా కూడా అంచనాలు పీక్స్ లో ఉంటాయి. ప్రతి సారి కూడా సినిమా విడుదల సమయంలో హీరో పాత్ర గురించి చర్చ జరుగుతుంది. కానీ ఈ సారి మాత్రం హీరోల పాత్రల విషయంలో పోటా పోటీగా మాటల యుద్ధం జరుగుతోంది.

ఈ మాటల యుద్ధంను రాజమౌళి పది సంవత్సరాల క్రితమే ఊహించాడు. కానీ తన కంటెంట్‌ పై నమ్మకంతో ఇద్దరు హీరోలతో సినిమాలు చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమా విడుదల కాకముందే వివాదాలకు తెర తీస్తూ అభిమానులు సోషల్ మీడియా ద్వారా రచ్చ చేస్తున్నారు. ఎప్పుడు కూడా తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అని కొట్టుకునే ఫ్యాన్స్ ఈ సినిమా కోసం కలిసి సందడి చేస్తారు అని అనుకుంటే అది పొరపాటే అవుతుంది అని అభిమానుల నిరూపించారు.

సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సినిమాకు సంబంధించిన విషయాలు ట్రెండ్‌ అవుతాయి అనుకుంటే ఇద్దరు హీరోల అభిమానులు విమర్శలు ట్రెండ్ అవుతున్నాయి. ఒక హీరో ఫాన్స్ మరో హీరోని అవమానించే విధంగా ట్రోల్స్‌ మరియు మీమ్స్‌ చేస్తున్నారు. దాంతో విడుదల సమయానికి ఈ వివాదం మరింతగా పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ గొడవలు అన్నీ కూడా రాజమౌళి పది సంవత్సరాల క్రితమే ఊహించాడు. పదేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ తాను మల్టీస్టారర్ సినిమాలు చేయాలని అనుకున్నా కూడా వారి అభిమానులు అందుకు సహకరించరు అని అన్నాడు. నేను మాత్రమే కాదు ఎవరు మల్టీస్టారర్ చేయాలనుకున్నా కూడా వారి వారి అభిమానులకు సంతృప్తిని కలిగించ లేరు. అందుకే మల్టీస్టారర్ సినిమాలను ఇప్పుడు ఎవరూ చేయడం లేదు అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

ఒకవేళ చేసినా కూడా ఇద్దరు హీరోల అభిమానులు కచ్చితంగా కొట్టుకుంటారు అంటూ ఆయన ఆ ఇంటర్వ్యూలో చెప్పాడని సోషల్‌ మీడియాలో జనాలు గుర్తు చేసుకుంటున్నారు.  10 సంవత్సరాల క్రితం రాజమౌళి ఏదైతే ఊహించి మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ లేదు అని అన్నాడో అదే ఇప్పుడు జరుగుతోంది. ఇద్దరు హీరోల సోషల్‌ మీడియా వివాదం మరింత ముదిరింది. ఈ వివాదం ఎక్కడి వరకు దారి తీస్తుందో అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఈ ఇద్దరు హీరోలు చాలా క్లోజ్ గా ఉంటున్నారు కానీ వారి అభిమానులు మాత్రం నువ్వా నేనా అన్నట్లు గా సోషల్ మీడియాలో బూతులు మాట్లాడుతూ ఎవరికి వారు నచ్చినట్లుగా ప్రత్యర్థి విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

ఈ వ్యవహారం ముందు ముందు మరిన్ని సమస్యలు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొందరు అభిమానులు మాత్రం ఈ సమయంలో సంయమనం పాటిస్తూ సినిమా కోసం ఎదురు చూస్తున్నామని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు.
Tags:    

Similar News