'భీమ్లా నాయక్' ట్రైలర్ మామూలుగా లేదన్న చరణ్!

Update: 2022-02-23 11:30 GMT
పవణ్ కల్యాణ్ - రానా ప్రధానమైన పాత్రలను పోషించిన 'భీమ్లా నాయక్' నుంచి ఈ నెల 21వ తేదీన ట్రైలర్ ను వదిలారు. నిజానికి అదే రోజున ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించి ఆ వేదిక ద్వారా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయాలనుకున్నారు .. కానీ కొన్ని కారణాల వలన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపడం కుదరలేదు .. ట్రైలర్ ను మాత్రం రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ను ఇలా వదలడమే ఆలస్యం .. అలా సునామీలా దూసుకుపోయింది.

పవన్ - రానా పాత్రలను ప్రధానంగా చేసుకుని ఈ ట్రైలర్ ను కట్ చేశారు. యాక్షన్ .. ఎమోషన్ ను కలుపుతూ వదిలిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

ఈ నేపథ్యంలో ఈ ట్రైలర్ చూసిన సినీ ప్రముఖులు చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా టీమ్ పై ప్రశంసలను కురిపిస్తున్నారు.

 తాజాగా ఆ జాబితాలో చరణ్ కూడా చేరిపోయాడు. ఈ సినిమా ట్రైలర్ గురించి చరణ్ స్పందిస్తూ .. "భీమ్లా నాయక్' ట్రైలర్ ఎలక్ట్రిఫయింగ్ .. పవన్ కల్యాణ్ గారి యాక్షన్ .. ఆయన చెప్పే ప్రతి డైలాగ్ పవర్ఫుల్. నా మిత్రుడు రానా పెర్ఫార్మెన్స్ అండ్ ప్రెజెన్స్ అద్భుతం. త్రివిక్రమ్ గారు .. సాగర్ చంద్ర .. నిత్యామీనన్ .. సితార బ్యానర్ .. తమన్ .. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్'' అంటూ ట్వీట్ చేశాడు.

ఈ సినిమాలో పవన్ భార్య పాత్రలో నిత్యామీనన్ నటించగా .. రానా సరసన సంయుక్త మీనన్ అలరించనుంది. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇప్పటికే ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్ వచ్చింది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సముద్రఖని .. రావు రమేశ్ .. మురళీశర్మ .. రఘుబాబు కనిపించనున్నారు. ఈ రోజు సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్న ఈ సినిమా, ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక చరణ్ విషయానికి వస్తే ఆయన చిరంజీవితో కలిసి నటించిన 'ఆచార్య' విడుదలకు సిద్ధమవుతోంది. ఆ తరువాత సినిమాను ఆయన శంకర్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. ఆ తరువాత సినిమాను ఆయన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయనున్నట్టు ఒక వార్త షికారు చేస్తోంది. నెక్స్ట్ ప్రాజెక్టులు సుకుమార్ .. కొరటాలతో ఉండనున్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం మెగా అభిమానులంతా 'ఆచార్య' పైనే దృష్టి పెట్టారు. మరి ఈ సినిమా సంచలనానికి తెరతీస్తుందేమో చూడాలి.     
Tags:    

Similar News