మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులు ప్రతి పండుగను వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. ప్రతి సందర్బంలో కూడా ఈ దంపతులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నారు. పెళ్లి అయ్యి ఇన్నాళ్లు అయినా కూడా వీరిద్దరి జోడీ చాలా క్యూట్ అంటూ ఇప్పటికి జనాలు చర్చించుకోవడం జరుగుతుంది. వీరి జంటకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతూనే ఉంటారు. రామ్ చరణ్ సినిమాలతో మరియు ఉపాసన బిజినెస్ లు మరియు సామాజిక కార్యక్రమాలతో చాలా బిజీగా ఉన్నా కూడా కచ్చితంగా ఇలాంటి వేడుకలు వారు జరుపుకుంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక వీరు ఇద్దరు కూడా పెట్ లవర్స్. ఇద్దరికి కూడా పెట్స్ అంటే ఎంత ఇష్టమో గతంలో పలు సందర్బాల్లో వెళ్లడి అయ్యింది.
తాజాగా మరోసారి వీరిద్దరికి పెట్స్ అంటే ఎంత ఇష్టమో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పెట్స్ తో ఇద్దరు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నారు. తమ ఇంటిని అలంకరించుకోవడం మాత్రమే కాకుండా తాము ఎంతో ప్రేమగా చూసుకునే పెట్స్ ను కూడా వీరు అలంకరించి వాటితో తమ పండుగను జరుపుకున్నారు. ఈ ఫొటోలో రామ్ చరణ్ మరియు ఉపాసనల జంటను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరు ఎంత బిజీగా ఉన్నా కూడా తమ వైవాహిక జీవితాన్ని చక్కగా కొనసాగిస్తూ ఇతర జంటలకు ఆదర్శంగా నిలుస్తున్నారు అనడంలో సందేహం లేదు. వీరిద్దరి అభిరుచికి తగ్గట్లుగా ఎన్నో పెట్స్ వారి వద్ద ఉన్నాయి. ప్రతి ఒక్క పెట్ ను కూడా వారు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారని ఈ ఫొటోను చూస్తుంటేనే అర్థం అవుతోంది.
ఉపాసన మరియు చరణ్ ల దంపతుల క్రిస్మస్ వేడుక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రతి ఒక్క ఫొటో కూడా వీరిది వైరల్ అవ్వడం చాలా కామన్ విషయం. కాని ఈసారి క్రిస్మస్ వేడుక సెలబ్రేషన్స్ చాలా స్పెషల్ గా ఉన్నాయంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్ తో గంట కూడా తీరిక లేకుండా బిజీగా ఉన్నాడు. అయినా కూడా క్రిస్మన్ ను ఉపాసనతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం కోసం జక్కన్న వద్ద పర్మీషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ముంబయిలో బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేసిన వీరు వెంటనే మళ్లీ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత చరణ్ చేస్తున్న మూవీ ఇప్పటికే పట్టాలెక్కింది. శంకర్ దర్శకత్వంలో ఆ సినిమా రూపొందుతోంది. 2023 లో రాబోతున్న ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చరణ్ మూవీ ఉండబోతుందట.
తాజాగా మరోసారి వీరిద్దరికి పెట్స్ అంటే ఎంత ఇష్టమో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పెట్స్ తో ఇద్దరు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నారు. తమ ఇంటిని అలంకరించుకోవడం మాత్రమే కాకుండా తాము ఎంతో ప్రేమగా చూసుకునే పెట్స్ ను కూడా వీరు అలంకరించి వాటితో తమ పండుగను జరుపుకున్నారు. ఈ ఫొటోలో రామ్ చరణ్ మరియు ఉపాసనల జంటను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరు ఎంత బిజీగా ఉన్నా కూడా తమ వైవాహిక జీవితాన్ని చక్కగా కొనసాగిస్తూ ఇతర జంటలకు ఆదర్శంగా నిలుస్తున్నారు అనడంలో సందేహం లేదు. వీరిద్దరి అభిరుచికి తగ్గట్లుగా ఎన్నో పెట్స్ వారి వద్ద ఉన్నాయి. ప్రతి ఒక్క పెట్ ను కూడా వారు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారని ఈ ఫొటోను చూస్తుంటేనే అర్థం అవుతోంది.
ఉపాసన మరియు చరణ్ ల దంపతుల క్రిస్మస్ వేడుక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రతి ఒక్క ఫొటో కూడా వీరిది వైరల్ అవ్వడం చాలా కామన్ విషయం. కాని ఈసారి క్రిస్మస్ వేడుక సెలబ్రేషన్స్ చాలా స్పెషల్ గా ఉన్నాయంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్ తో గంట కూడా తీరిక లేకుండా బిజీగా ఉన్నాడు. అయినా కూడా క్రిస్మన్ ను ఉపాసనతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం కోసం జక్కన్న వద్ద పర్మీషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ముంబయిలో బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేసిన వీరు వెంటనే మళ్లీ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత చరణ్ చేస్తున్న మూవీ ఇప్పటికే పట్టాలెక్కింది. శంకర్ దర్శకత్వంలో ఆ సినిమా రూపొందుతోంది. 2023 లో రాబోతున్న ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చరణ్ మూవీ ఉండబోతుందట.