పోస్టు పెట్టి మళ్లీ కెలికేసిన రౌతేలా.. నెటిజన్లకు పనే పని

Update: 2022-10-10 04:54 GMT
సోషల్ మీడియాలో లైవ్ లో ఉండాలి. తన గురించే మాట్లాడుకోవాలి. తన గురించే మాటలు చెప్పాలన్న ఆత్రుత కొందరు ప్రముఖులు.. సెలబ్రిటీల్లో ఎక్కువ అవుతోంది. ఇందుకోసం వారు వేసే యేషాలతో రచ్చ చేస్తున్నారు. ఆ మధ్యన టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ను తన పోస్టులతో కెలికేసి.. దాదాపు రెండు నెలల పాటు సోషల్ మీడియాలో తన గురించే పెద్ద ఎత్తున చర్చ జరిగేలా చేశారు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా.

తన కోసం హోటల్ లాబీలో గంటల పాటు వెయిట్ చేశాడంటూ అమ్మడు పెట్టిన పోస్టు.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల గురించి తెలిసిందే. చివర్లో ఊర్వశి సారీ చెప్పటంతో ఇష్యూ అక్కడితో ముగిసింది. వాతావరణం ప్రశాంతంగా ఉంటే ఏ మాత్రం నచ్చదన్నట్లుగా ఊర్వశి తాజాగా మరో పోస్టు పెట్టి కెలికేశారు. పంత్ ను టార్గెట్ చేసినట్లుగా ఆమె తాజా పోస్టు ఉందన్న మాట వినిపిస్తోంది. 'లవ్ ను ఫాలో అవుతూ ఆస్ట్రేలియా' అంటూ ప్రైవేట్ జెట్ లో తాను ప్రయాణిస్తున్న పిక్ ను పెట్టేసి.. తాజా మెసేజ్ తో నెటిజన్లకు పని చెప్పింది.

ఊర్వశి నుంచి ఈ తరహా పోస్టు వస్తుందని ఊహించని వారంతా షాక్ అయ్యే పరిస్థితి. పంత్ ను ప్రశాంతంగా బతకనిచ్చేట్లు లేదని కొందరు కామెంట్లు చేస్తున్నారు. టీమిండియా ప్రపంచ కప్ గెలవాలంటే పంత్ చాలా కీలకమని.. దయచేసి అతగాడ్ని వదిలేయాలంటూ ఆమెను కోరుతూ పోస్టులు పెడుతున్నారు.

అతడు డిస్ట్రబ్ కాకుండా వదిలేయ్ అని కొందరు సలమా ఇస్తుంటే.. మరికొందరు మరో అడుగు ముందుకేసి.. ఇటీవల పాక్ యువ పేసర్ నసీం షాతో కలిసి ఉన్నట్లుగా వచ్చిన ఫోటోలను ట్యాగ్ చేస్తూ.. 'వరల్డ్ కప్ లో పాక్ కు నసీం షా కీలక బౌలర్. అమ్మడు వాడ్ని తగులుకుంటే మన పని సులువు అవుతుంది' అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

మొత్తానికి తన ఒక్క పోస్టుతో ప్రశాంతంగా ఉన్న కొలనులో ఎలా అయితే.. రాళ్లు వేస్తే అలజడి మొదలవుతుందో.. ఊర్వశీ పెట్టిన పోస్టు ఇప్పుడు అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. ఏమైనా ఒక మెగా ఈవెంట్ కు ముందు ఇలా కెలికేసే పోస్టులు ఆట మీద ధ్యాసను పక్కన పెట్టేలా చేస్తాయంటున్నారు. మొత్తానికి ఊర్వశీ తీరు చూస్తే.. పంత్ ను అమ్మడు ఇప్పట్లో వదిలేలా లేదన్న మాట వినిపిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News