ఫియాన్సీని కాపాడటంలో హెల్ప్‌ కావాలి

Update: 2016-03-22 17:30 GMT
ఏంటో మన హీరోలు. పబ్లిసిటీకు కొత్త కొత్త అర్ధాలు చెప్పేస్తున్నారు. అందుకే ఇప్పుడు తనదైన శైలిలలో తన స్నేహితుడు సందీప్‌ కిషన్‌ సినిమాను ప్రమోట్‌ చేయాలని.. హీరో సాయిధరమ్‌ తేజ్‌ బాగానే కష్టపడుతున్నాడు.

సందీప్‌ 'రన్‌' సినిమా రేపు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌ అనీషా ఆంబ్రోస్‌ ను విలన్లు కిడ్నాప్ చేస్తారు. ఆమె ఎక్కడుందో కనిపెట్టడమే ఒక రోజులో హీరో చేసే పని. అదే రన్‌ సినిమా. అందుకే ఇప్పుడు తన ఫియాన్సీని కాపాడటంలో మా హీరోకి హెల్ప్‌ కావాలి. మీరందరూ రేపు ధియేటర్లకు రండి అంటూ సందేశాలు ఇస్తున్నాయడు మెగా మేనల్లుడు.

మామూలుగా అందరూ టివిల్లో.. ఇతర మీడియాల్లో తెగ ప్రచారం చేస్తుంటే.. ఎందుకో సందీప్‌ కిషన్‌ ఈసారి ఊరూరా కాలేజీలకు తిరిగి అక్కడ ప్రమోషన్లు చేశాడు. కాని చాలామంది విద్యార్దులకు పరీక్షల కాలం కదా.. ఇప్పుడు కాలేజీల్లో ప్రమోషన్‌ చేస్తే ఉపయోగం ఉంటుందా? అందుకే సాయిధరమ్‌ తన వంతు సాయం చేస్తున్నట్లున్నాడు.
Tags:    

Similar News