3 రోజులు అల్లాడిపోయాను -సమంత

Update: 2015-12-07 05:02 GMT
చెన్న‌య్ వ‌ర‌ద‌లు సెల‌బ్రిటీల్ని అల్లాడించేశాయ్‌. ప్ర‌కృతి విల‌యం క‌మ్యూనికేష‌న్‌ని తెంచేసింది. దీంతో ఇటొచ్చినోళ్లంతా(ఔట్‌ డోర్‌) చెన్న‌య్ లోని త‌మ బంధువులు ఏమైపోయారో అని వేద‌న చెందారు. వ‌ర‌ద ఉధృతి చూసి ఇక అయిపోయిన‌ట్టే అని బెంబేలెత్తారు. అప్ప‌ట్లో క‌మెడియ‌న్ వివేక్ హైద‌రాబాద్‌ లో చిక్కుకుపోయి చెన్న‌య్‌ లో త‌మ‌వారికి ఏమైపోయిందోన‌ని ఆవేద‌న చెందారు. స‌రిగ్గా అలాంటి స‌న్నివేశంలోనే స్టార్ హీరోయిన్ స‌మంత కూడా బుక్క‌యిపోయింది.

చెన్న‌య్ వ‌ర‌ద‌ల వేళ స‌మంత విజ‌య‌వాడ‌లో స్ట‌క్ అయ్యింది. అక్క‌డ త‌మ‌వారు ఏమైపోయారో అన్న ఆవేద‌న‌తో మూడు రోజుల పాటు కంటిమీద నిదురే లేకుండా గ‌డిపేసిందిట‌. ఓ వైపు క‌మ్యూనికేష‌న్ మొత్తం క‌ట్ అయిపోయింది. ఫోన్ చేసి మాట్లాడే అవ‌కాశం కూడా లేదు. దాంతో ఎంతో క‌ల‌త చెందాన‌ని స‌మంత చెప్పింది. ఇలాంటి స‌న్నివేశాన్ని జీవితంలో ఎప్పుడూ చూడ‌లేద‌ని చెప్పింది. చెన్న‌య్‌లో ఎంతోమంది తిండి, నీరు  లేకుండా ఎంతో ఇబ్బంది ప‌డుతున్నారు. వాళ్లంద‌రికీ సాయం చేసేందుకు వెళ్లాల‌నుకుంటున్నా... అంటూ చెప్పుకొచ్చింది. అయితే స‌మంత విజ‌య‌వాడ‌లో స్ట‌క్ అయిపోవ‌డానికి కార‌ణం ఇక్క‌డ బ్ర‌హ్మోత్స‌వం షూటింగు లో పాల్గొన‌డ‌మే.

ఇప్పుడు చెన్న‌య్ కోసం స‌మంత వెళ్లాల్సిన రైట్ టైమ్ వ‌చ్చింది. సొంతూరికి ఏదో ఒక‌టి చేయాల్సిన త‌రుణ‌మిది. అక్క‌డ ప్ర‌జ‌లు క‌ష్టాల్లో ఉన్నారు. స‌మంత మ‌న‌ను ఎంతో మంచిది. ప్ర‌త్యూష ఫౌండేష‌న్ త‌ర‌పున ఇప్ప‌టికే ఎంద‌రో చిన్నారుల‌కు లైఫ్‌ నిస్తోంది. ఇప్పుడు తిండి - నీరు అంద‌క అల్లాడిపోతున్న ప్ర‌జ‌ల‌కు ఈ సంస్థ త‌ర‌పున భారీగా సాయం చేయాల్సి ఉంది. ఇప్ప‌టికే స‌మంత ప్లానింగులోనే ఉంద‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News