శ్రీవారి సన్నిధిలో అక్కినేనివారి కోడలు

Update: 2018-08-05 11:52 GMT
స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని ఆదివారం నాడు తిరుమల లో శ్రీ వెంకటేశ్వరస్వామివారి దర్శనం చేసుకుంది.  ఆదివారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆమె ఏడుకొండల స్వామి సేవలో పాల్గొంది.   స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత రంగనాయకుల మండపంలో అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు.

తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత ఆమె మాట్లాడుతూ తనకు తిరుమల అంటే ఎంతో ఇష్టమని, గతంలో కూడా వెంకటేశ్వర స్వామి దర్శనానికి చాలా సార్లు రావడం జరిగిందని, స్వామివారిని దర్శించుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుందని చెప్పుకొచ్చింది.  సమంత మామగారైన అక్కినేని  నాగార్జునకు కూడా ఏడుకొండల స్వామివారంటే తనకు ఎంతో భక్తి అని గతంలో చాలా సార్లు చెప్పిన విషయం తెలిసిందే.  ఇప్పుడు అక్కినేని వారి కోడలు కూడా మామగారి బాటలోనే వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావడం, స్వామిని దర్శించుకుంటే ఎంతో సంతోషంగా ఉంటుందని చెప్పడం విశేషమే.

మరో వైపు సమంత తాజా చిత్రం 'U-టర్న్' సినిమా త్వరలో రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఇదొక్కటే కాకుండా తమిళ, తెలుగు భాషల్లో పలు సినిమాల షూటింగ్ తో బిజీగా ఉంది సమంత.  అందులో ఒక చిత్రంలో తన హస్బెండ్ నాగ చైతన్యతో కలిసి నటిస్తుండడం విశేషం.
Tags:    

Similar News