శృతి హాసన్ కు సంక్రాంతి డబుల్‌ పరీక్ష

Update: 2022-12-15 02:30 GMT
యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్ నట వారసురాలు శృతి హాసన్ ఈ సంక్రాంతికి తెలుగు బాక్సాఫీస్ వద్ద రెండు సినిమాలతో సందడి చేయబోతుంది. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ఒకటి కాగా రెండవది బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహారెడ్డి సినిమా. ఈ రెండు సినిమాలు కూడా భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్‌ తో రూపొందిన విషయం తెల్సిందే.

ఈ రెండు సినిమాలకు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అయినట్లుగా ఈ రెండు సినిమాల యొక్క హీరోయిన్ కూడా శృతి హాసన్‌. ఈ రెండు సినిమాలు కూడా ఆమెకు అత్యంత కీలకం గా మారబోతున్నాయి. ఈ సినిమాలు సక్సెస్ అయితే స్టార్‌ సీనియర్‌ హీరోలకు ఈమె మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా నిలిచే అవకాశం ఉంది అంటూ మీడియా సర్కిల్స్ లో టాక్.

శృతి హాసన్ ఈ రెండు సినిమాల విషయంలో చాలా నమ్మకంతో కనిపిస్తుంది. ఈ ఇద్దరు దర్శకుల్లో ఈమె గతంలో గోపీచంద్‌ మలినేనితో కలిసి వర్క్ చేసింది.. లక్కీగా ఆ సినిమా శృతి హాసన్ కు మంచి విజయాన్ని కట్టబెట్టింది. అందుకే ఈ సినిమా పై కూడా చాలా నమ్మకంతో శృతి హాసన్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

వాల్తేరు వీరయ్య మరియు వీర సింహారెడ్డి సినిమాలు ఒకే ఒక్క రోజు గ్యాప్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఈ రెండు సినిమాలు కూడా నువ్వా నేనా అన్నట్లుగా వంద కోట్లకు పైగా బడ్జెట్‌ తో రూపొందిన విషయం తెల్సిందే.

సంక్రాంతి రేసులో పోటీ పడబోతున్న ఈ రెండు సినిమాలతో శృతి హాసన్ కూడా తన సినిమాతో తానే పోటీ పెట్టుకున్న పరిస్థితి. ఈ రెండు సినిమాలు కూడా శృతికి పెద్ద పరీక్ష అన్నట్లుగా పరిస్థితి ఉంది. అందుకే శృతి హాసన్ ఈ డబుల్‌ పరీక్ష లో ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటుంది అనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News