హైదరాబాద్ లో బిజీ అవుతున్న షారుక్ ఖాన్

Update: 2022-06-18 01:30 GMT
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వెండితెరకు గ్యాప్ ఇచ్చి చాలా కాలమైన విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో 2018 లో వచ్చిన జీరో సినిమాతో బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ ను సొంతం చేసుకున్న షారుక్ ఖాన్ ఆ తర్వాత మరో సినిమా చేయడానికి ఎంతగానో ఆలోచించాడు. అసలు సినిమాలు చేయకూడదు అని ఆలోచనలో కూడా వెళ్లినట్లు అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. కానీ మళ్ళీ తనను తాను మార్చుకుంటూ సరికొత్త కథలూ అందించాలనే బలంగా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఎవరూ ఊహించని విధంగా షారుఖ్ ఒకేసారి మూడు ప్రాజెక్టులు లైన్ లోకి తీసుకువచ్చి ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా జవాన్ సినిమా పై సౌత్ ఇండస్ట్రీ లో కూడా అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఎందుకంటే తమిళ దర్శకుడు అట్లీ ఆ సినిమాను కేవలం హిందీలోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా భారీగానే విడుదల చేయాలని అనుకుంటున్నారు. అయితే ఆ ప్రాజెక్టు సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను హైదరాబాద్లోనే షూట్ చేయబోతున్నారు.

ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో ఒక ప్రత్యేకమైన సెట్ కూడా నిర్మించడం జరిగింది. ఇక దాదాపు నెల రోజుల పాటు జరగబోయే ఈ కీలక షెడ్యూల్ కోసం షారుక్ ఖాన్ హైదరాబాద్ లోనే ఉండబోతున్నట్లు సమాచారం. ఎలాగైనా ఈ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో కూడా తన కంటూ ఒక మార్కెట్ ను క్రియేట్ చేసుకోవాలి అని షారుక్ ఖాన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకుంది. జావాన్ సినిమాతో పాటు షారుక్ ఖాన్ డంఖీ మరో సినిమా కూడా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

అలాగే సల్మాన్ ఖాన్ తో కూడా పఠాన్ అనే సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇలా విభిన్నమైన భారీ ప్రాజెక్టులతో ఒక్కసారిగా తన స్థాయిని చేసుకుంటున్నాడు. మరి ఈ సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.
Tags:    

Similar News