బాలయ్య కోసం పి.వి.సింధు

Update: 2017-10-06 10:32 GMT
గత ఏడాది రియో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో రజత పతకం గెలిచాక తెలుగమ్మాయి పూసర్ల వెంకట సింధు రేంజే మారిపోయింది. ఆ ప్రదర్శనతో ఆమె దేశవ్యాప్తంగా గొప్ప పేరు సంపాదించింది. ప్రస్తుతం సింధు వేసే ప్రతి అడుగూ జనాలకు ఆసక్తికరమే. ఆమె ఏ కార్యక్రమంలో పాల్గొన్నా అది ప్రత్యేకతను సంతరించుకుంటుంది. తాజాగా సింధు.. ఫేమస్ క్విజ్ రియాలిటీ షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’లో పాల్గొంది. ఆమె ఓ మంచి పని కోసం ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసింది. హైదరాబాద్‌ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్‌ కు నిధులు సమకూర్చేందుకు సింధు.. ‘కౌన్ బనేగా కరోడ్ పతి’లో పాల్గొంది.

అమితాబ్ బచ్చన్ హోస్ట్‌ గా వ్యవహరించే షోకు సింధు ఇప్పటికే హాజరైంది. కొన్ని రోజుల కిందటే సింధు మీద ఎపిసోడ్ చిత్రీకరించారు. దాన్ని శుక్రవారం రాత్రి ప్రసారం చేయబోతున్నారు. ఈ గేమ్ షోలో సింధు గెలిచిన మొత్తం బసవతారకం ఆసుపత్రికి వెళ్తుంది. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పేరు మీద ఏర్పాటైన ఈ ఆసుపత్రికి నందమూరి బాలకృష్ణ ఛైర్మన్ అన్న సంగతి తెలిసిందే. దీని కోసం బాలయ్య సైతం విదేశాల్లో పర్యటించి విరాళాలు సేకరిస్తుంటాడు. మరి ఈ షోలో సింధు ఎంత డబ్బులు గెలిచి బసవతారకం హాస్పిటల్‌ కు ఇస్తుందో చూడాలి. సింధు ప్రస్తుతం డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో పాల్గొనేందుకు వెళ్లింది. ఆమె ఇక్కడ లేని సమయంలో ‘కౌన్ బనేగా కరోడో పతి’లో తన ప్రోగ్రాం ప్రసారం కానుంది.
Tags:    

Similar News