ఏప్రిల్ 21న 'ఆదిపురుష్‌' నుంచి స్పెషల్ అప్డేట్..?

Update: 2021-03-30 04:41 GMT
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ - బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ''ఆదిపురుష్‌''. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో రూపొందే ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్.. సీత పాత్రలో బాలీవుడ్ భామ కృతి సనన్ నటించనున్నారు. అలానే రావణుడిగా సైఫ్ అలీఖాన్.. లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌ కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో జరుగుతోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల చేయనున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న 'ఆదిపురుష్' నుంచి త్వరలోనే ఓ అప్డేట్ రానుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఆదర్శ పురుషుడు రాముడి గాథ నేపథ్యంలో తెరకెక్కుతున్న 'ఆదిపురుష్' సినిమా నుంచి శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఓ స్పెషల్ అప్డేట్ ఉంటుందని అంటున్నారు. రాముని అవతారంలో ప్రభాస్ లుక్ ని ఏప్రిల్ 21న విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఇకపోతే 'ఆదిపురుష్ 3డి' చిత్రాన్ని తెలుగు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషలతో పాటుగా పలు విదేశీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని టీ-సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ - క్రిషన్ కుమార్ - ప్రసాద్ సుతార్ - రాజేష్ నాయర్ - ఓం రౌత్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
Tags:    

Similar News