పహిల్వాన్ గా మారిన ఈగ విలన్!

Update: 2018-12-23 12:07 GMT
కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ కు సౌత్ అంతా గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే.  'ఈగ' సినిమాలో ప్రతినాయక పాత్రతో సౌత్ ప్రేక్షకులందరినీ మెప్పించిన సుదీప్ 'బాహుబలి' లో కూడా నటించాడు.  'పులి' లాంటి తమిళ సినిమాల్లో కూడా నటించిన సుదీప్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చిత్రం 'సైరా' లో కూడా కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే కన్నడలో ఇప్పుడు  ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో నటించేందుకు సిద్ధమయ్యాడు.

'పహిల్వాన్' టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో సుదీప్ ఒక పహిల్వాన్ గా నటిస్తాడట. ఇందుకోసం ఇప్పటికే కుస్తీ.. బాక్సింగ్ లో మెళకువలను నేర్చుకుంటున్నాడట.  ఈ సినిమాలో స్టంట్స్ హై స్టాండర్డ్ లో ఉండడం కోసం హాలీవుడ్ స్టంట్ కోఆర్డినేటర్ లార్నెల్ స్టోవాల్ ను సైన్ చేశారట. ఈ సినిమాలో సుదీప్ సరసన ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.  కబీర్ దుహాన్ సింగ్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.   

ఈ సినిమాలో మరో హైలైట్ ఎంటంటే బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఒక ముఖ్య పాత్రం పోషించడం.  సినిమాకు అర్జున్ జన్యా సంగీతం అందిస్తాడు. ఎస్. కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.  ఈ సినిమా కోసం ఇప్పటికే హైదరాబాద్ లోని ఒక స్టూడియోలో సెట్స్ నిర్మాణం సాగుతోందట. 'కె జీ ఎఫ్' తర్వాత కన్నడ ఇండస్ట్రీ నుండి వస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ అనడం లో ఏమాత్రం సందేహం లేదు.
Tags:    

Similar News