అప్పుడు ఎత్తుకున్న పిల్లే ఇప్పుడు హీరోయిన్

Update: 2017-12-26 15:30 GMT
కామెడీ స్టార్ సునీల్ ప్రస్తుతం 2 కంట్రీస్ సినిమా మీద అంచనాలు పెంచడానికి ప్రమోషన్స్ తో చాలా బిజీగా ఉన్నాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆ సినిమాలో మనిషా హీరోయిన్ గా నటిస్తోంది. అయితే రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సునీల్ ఎవరు ఊహించని విధంగా ఒక విషయాన్ని చెప్పాడు. ఆ విషయం గురించి తెలిస్తే నిజానికి ఏ యాక్టర్ జీవితంలో అలాంటి ఇన్సిడెంట్ జరిగి ఉండదేమో అని అనుకోకుండా ఉండలేరు.

2 కంట్రీస్ సినిమా మొదలు పెట్టకముందు దర్శకుడు నిర్మాత అమెరికాలో లొకేషన్స్ ని చూడటానికి వెళ్లారు. అయితే అక్కడ వారికీ తెలిసిన వారికి ఇంటికి వెళ్ళినపుడు ఒక అమ్మాయిని చూసి ఆమెను హీరోయిన్ గా మన సినిమాలో సెలెక్ట్ చేస్తే బావుంటుంది అని పేరెంట్స్ ని ఒప్పించి ఒకే చేయించారు. వారు ఈ ఒక్క సినిమాకే అని చెప్పి మనీషా నిర్ణయంతో సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ చేశారట.

ఇక సునీల్ మరొక విషయం గురించి చెబుతూ.. సొంతం సినిమా కోసం న్యూజిలాండ్ వెళ్లినప్పుడు అక్కడి నుంచి సింగపూర్ వెళ్ళాం. అయితే ఇద్దరు భార్యాభర్తలు అక్కడికి వచ్చి ఒక ఫొటో దిగారు. అప్పుడు వారి పాపను నేను ఎత్తుకున్నాను. ఇకపోతే రీసెంట్ గా ఈ సినిమా హీరోయిన్ పేరెంట్స్  నన్ను కలిశారు. వారు నాతో ఒక మాట అన్నారు. కొన్నేళ్ల క్రితం సింగపూర్ లో మేము మిమ్మల్ని కలిశాం గుర్తుంది కదా! అని అన్నారు. అప్పుడు నేను షాక్ అయ్యాను. అంటే నేను ఎత్తుకున్నది ప్రస్తుతం నాతో నటించిన హీరోయిన్నా అని ఆశ్చర్యపోయా అంటూ సునీల్ నవ్వుతూ చెప్పాడు.       
Tags:    

Similar News