సూపర్ స్టార్ లేటెస్ట్ యాడ్: ఎంతైనా మహేష్ స్టైల్.. ఆ స్వాగ్ వేరబ్బా..!

Update: 2021-09-18 09:16 GMT
పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చేయకుండానే నేషనల్ వైడ్ పాపులారిటీ తెచ్చుకున్న స్టార్ ఎవరైనా ఉన్నారంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు అని చెప్పవచ్చు. అందుకే హాలీవుడ్ కటౌట్ తో ఉండే మహేష్ ని తమ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోడానికి వ్యాపార సంస్థలు పోటీ పడుతుంటాయి. ప్రస్తుతం మహేష్ చేతిలో ఉన్నన్ని ఎండార్స్మెంట్స్.. టాలీవుడ్ లో మరే ఇతర హీరోకి లేవని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఆయన్ని ప్రకటనల రారాజు అని అంటుంటారు. అయితే అందులో వచ్చే ఆదాయంలో సగానికి పైగా సేవా కార్యక్రమాలకే ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం మహేష్ ఓవైపు సినిమాలు మరోవైపు కమర్షియల్ యాడ్స్ తో బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రముఖ ఇ-కామర్స్ బ్రాండ్ ఫ్లిప్ కార్ట్ కూడా మహేష్ దగ్గరే ఉంది.

ఫ్లిప్ కార్ట్ కోసం మహేష్ బాబు చేసిన లేటెస్ట్ అడ్వర్టైజ్మెంట్ తాజాగా విడుదలైంది. సీనియర్ నటి తులసీతో కలిసి చేసిన ఈ యాడ్ లో మహేష్ కూల్ అండ్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. 'నా స్టైల్.. నా స్వాగ్.. నేనే కాదు ఇండియా మొతం ఫ్లిప్ అవుతుంది' అంటూ మహేష్ చెప్పిన డైలాగ్ తో ఉన్న ఈ కమర్షియల్ యాడ్ ఫన్నీగా ఉంది. ఇందులో ట్రెండీ కాస్ట్యూమ్స్ లో మహేశ్ మరింత యంగ్ గా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. ఇటీవలే 47వ ఏట అడుగుపెట్టిన మహేష్ ని ఈ యాడ్ లో చూసిన ఫ్యాన్స్.. టీనేజ్ కుర్రాడిలా ఉన్నాడంటూ మురిసిపోతున్నారు.

లేటెస్ట్ యాడ్ లో మహేష్ బాబు ని చూస్తే అభిమానుల కామెంట్స్ నిజమే అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో మరియు సూపర్ స్టార్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫ్లిప్ కార్ట్ త్వరలో ప్రారంభమయ్యే 'బిగ్ బిలియన్ డే సేల్' ప్రోగ్రామ్ కోసం మహేష్ బాబు తో ఈ వాణిజ్య ప్రకటనను షూట్ చేశారు. దక్షిణాదిలో కస్టమర్లను ఆకర్షించడానికి ఫ్లిప్ కార్ట్ కు మహేష్ చాలా ప్లస్ అవుతాడు. ఇక ఈ కంపెనీలో అమితాబ్ బచ్చన్ - అలియా భట్ మరియు విరాట్ కోహ్లీ ఇతర బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ పెట్లా దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. వింటేజ్ మహేష్ ని పరిచయం చేయబోతున్న ఈ సినిమా.. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే క్రమంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు తన 28వ సినిమా చేయనున్నారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ లో పూజాహెగ్డే హీరోయిన్ గా నటించనుంది. అలానే దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో దర్శకధీరుడు రాజమౌళి తో కలిసి మహేష్ ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్నారు.






Full View

Tags:    

Similar News