స్వీటీ గెస్ట్ రోల్ అదిరిందే !

Update: 2019-10-02 10:26 GMT
మెగా స్టార్ డ్రీం ప్రాజెక్ట్ 'సైరా నరసింహ రెడ్డి' ఎట్టకేలకు థియేటర్స్ లోకి  వచ్చేసింది. నేటి నుండి మెగా స్టార్ బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయబోతున్నాడు. మొదటి షోకె పాజిటీవ్ రిపోర్ట్స్ రావడంతో సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ రోజు సెలవు కావడంతో టాలీవుడ్ బెస్ట్ ఓపనరస్ లో రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గం అంచనా వేస్తున్నారు

ఇవన్నీ పక్కన పెడితే సినిమాలో అనుష్క చేసిన గెస్ట్ రోల్ మాత్రం థియేటర్స్ లో ఆడియన్స్ కి భలే కిక్కిచ్చింది. రిలీజ్ కి ముందే అనుష్క ఝాన్సీ లక్ష్మి భాయ్ గా నటిస్తుందన్న విషయం బయటికి వచ్చినా మేకర్స్ ఎక్కడా అనుష్క పెరేత్తలేదు. ప్రమోషన్స్ లో కూడా ఈ విషయం గురించి ఎలాంటి లీక్ ఇవ్వలేదు. ఇక స్వీటీ సైరా లో గెస్ట్ రోల్ చేసిందని తెలిసిన వారికేమో కానీ మిగతా వారికీ మాత్రం మంచి సప్రయిజ్ ఇచ్చింది.

సినిమా ప్రారంభంలో పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ అవ్వగానే 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో ఝాన్సీ లక్ష్మి భాయ్ తన సైనికుల్లో స్ఫూర్తిను నింపడానికి ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి గురించి చెప్పడంతో సినిమా అసలు కథ మొదలవుతుంది. ఆ క్యారెక్టర్ లో అనుష్క ని కాకుండా మరో కథానాయికను ఊహించుకోలేము. అందుకే ఈ రోల్ ను స్వీటీతో చేయించారు టీం. ఇప్పటికే 'అరుందతి' - 'రుద్రమదేవి' - 'బాహుబలి' వంటి సినిమాల్లో కత్తి పట్టిన వీరనారిగా మెప్పించిన అనుష్క మరోసారి సైరాలో ఝాన్సీ లక్ష్మి భాయ్ గా మంచి మార్కులు కొట్టేసింది. గెటప్ కి తగ్గట్లే తన కంఠంతో థియేటర్స్ లో విజిల్స్ వేయించింది. నిజానికి సైరాలో అనుష్క కనిపించింది తక్కువ సేపే అయినా ఎక్కువ ఇంపాక్ట్ ఇచ్చింది.


Tags:    

Similar News