ముసుగు తొల‌గించిన మాస్క్ మ్యాన్!

Update: 2022-12-16 04:31 GMT
స్టార్ హీరోయిన్ భర్త.. నీలి చిత్రాల కేసులో ఇరుక్కున్న ప్ర‌ముఖ‌ ముంబై బిజినెస్ మేన్ ఎట్టకేలకు తన ముసుగు తొలగించాడు. ఇన్నాళ్లు దాగుడు మూత‌ల దండాకోర్ అంటూ ముఖానికి ముసుగు తొడుక్కుని ప‌బ్లిక్ తో ప‌రాచికం ఆడిన అత‌డు ఇప్పుడు మాస్క్ ని తొల‌గించ‌డం ముంబై స‌ర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఈ క‌థ‌లో స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి కాగా ముసుగు తొల‌గించిన మాస్క్ మ్యాన్ శిల్పాజీ భ‌ర్త‌ రాజ్ కుంద్రా. 2023 ప్రారంభంలో రాజ్ కుంద్రా అడల్ట్ ఫిల్మ్ స్కామ్ లో అరెస్టయినప్పుడు ప్ర‌ముఖంగా హెడ్ లైన్స్ లోకొచ్చాడు. ఆ అరెస్టు జరిగినప్పటి నుండి రాజ్ కుంద్రా- శిల్పాశెట్టి దంప‌తుల ఎమోష‌న‌ల్ లైఫ్ జ‌ర్నీ గురించి ప్ర‌జ‌ల‌కు తెలుసు. రాజ్ బెయిల్‌పై బయటకు వచ్చినప్పటి నుండి ప‌బ్లిక్ లోకి రావాలంటే విచిత్రమైన ముసుగులను ధ‌రించి తన ముఖాన్ని పదే పదే దాచుకుంటున్నాడు. మీడియా సైతం ఈ మాస్క్ మ్యాన్ ఎవ‌రు? అంటూ ప‌రాచికాలు ఆడ‌టం మొద‌లు పెట్టింది. మాస్క్ ధ‌రించిన‌ రాజ్ ఫోటోలు వీడియోల‌ను షేర్ చేస్తూ టీఆర్పీ గేమ్ ఆడింది. త‌న‌ ముఖాన్ని కప్పి ఉంచినా పోలీసుల న్యాయ‌మూర్తుల‌ ముఖాల‌ను ఎప్ప‌టికీ క‌ప్ప‌లేడు అన్న నిజం అత‌డికి స్ప‌ష్టంగా తెలుసు.

ఇన్నాళ్లు ఆడిన‌ పిల్లి-ఎలుక ఆట‌ను ముగించే టైమొచ్చింది. చివరకు తన ముసుగును తొలగించి ప‌బ్లిక్ లో క‌నిపిస్తున్నాడు. ప్ర‌స్తుతం య‌థావిధిగా శిల్పాశెట్టి స‌హా త‌న కిడ్స్ తో ప‌బ్లిక్ లో స్వేచ్ఛ‌గా క‌నిపిస్తున్నాడు. త‌న‌కు అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో ముంద‌స్తు బెయిల్ కూడా మంజూరు కావ‌డంతో ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నాడు. ఇటీవ‌ల అత‌డు ప‌బ్లిక్ అప్పియెన్సుల్లో ఎటువంటి ముసుగు ధరించడంలేదు. పైగా మునుప‌టిలా య‌థావిథిగా మీడియాకు కూడా పోజులు ఇస్తున్నాడు. గేమ్ ఈజ్ నాట్ ఎండ్.. ఇట్ కంటిన్యూస్...!

క్లిష్ట‌మైన‌ కేసులో కుంద్రా ఫైన‌ల్ డెస్టినేష‌న్?

అశ్లీల చిత్రాల కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త- వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు ఎట్టకేలకు సుప్రీంకోర్టు నుంచి ఇటీవ‌లే కొంత ఊరట లభించింది. రాజ్‌ కుంద్రాతో పాటు మోడల్స్‌ షెర్లిన్‌ చోప్రా- పూనమ్‌ పాండే- ఉమేష్‌ కామత్ లకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో అవసరమైతే విచారణకు సహకరించాలని నిందితులందరినీ కోర్టు కోరింది. అసభ్యకర కంటెంట్ ని తయారు చేసి OTT ప్లాట్ ఫామ్ లో విడుదల చేసిన కేసులో ఆ ముగ్గురికి ఇది అతిపెద్ద ఊర‌ట‌.

గత నెలలో మహారాష్ట్ర సైబర్ పోలీసులు అశ్లీల చిత్రాల కేసులో రాజ్ కుంద్రా- షెర్లిన్ చోప్రా- పూనమ్ పాండేలపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ముంబై చుట్టుపక్కల ఉన్న ఫైవ్ స్టార్ హోటళ్లలో రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలను చిత్రీకరించాడని ఆపై వాటిని ఓటీటీ ప్లాట్ ఫారమ్ లకు విక్రయించాడని ఛార్జిషీట్ పేర్కొంది. రాజ్ కుంద్రా సార‌థ్యంలోని ఈ డీల్ విలువ కోట్లాది రూపాయ‌లుగా ఉంద‌ని కూడా ఛార్జ్ షీట్ లో పేర్కొంది. పూనమ్- షెర్లిన్ లతో రాజ్ ఈ చిత్రాలను తెరకెక్కించాడని సీబీఐ ఆరోపించింది.

రాజ్‌ కుంద్రాపై చార్జిషీటు దాఖలైన తర్వాత ఆయన లాయర్‌ వాంగ్మూలం తెరపైకి వచ్చింది. ఈ విషయం తనకు మీడియా ద్వారానే తెలిసిందని చట్ట ప్రకారం కోర్టుకు హాజరైన తర్వాత చార్జిషీట్ కాపీని తీసుకుంటానని లాయర్ తెలిపారు. అంతే కాదు మీడియా కథనాలతో కానీ.. ఎఫ్‌.ఐ.ఆర్ లో ఉన్న ఆరోపణలతో కానీ తన క్లయింట్ కు ఎలాంటి సంబంధం లేదని న్యాయవాది చెప్పారు. మొబైల్ అప్లికేషన్ లో అసభ్యకరమైన సినిమాలు తీసి అప్ లోడ్ చేసినందుకు గత ఏడాది జూలైలో రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు. ఆ తర్వాత జైలులో ఉన్న అతను రెండు నెలల తర్వాత బెయిల్ పొందాడు. మరోవైపు శిల్పాశెట్టి ఈ విషయంలో పెదవి విప్పలేదు. తొలి నుంచి త‌న భ‌ర్త‌కు మ‌ద్ధ‌తుగా నిలిచింది. ఈ జంట విడిపోతార‌న్న పుకార్ల‌కు కూడా చెక్ పెట్టారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View



Tags:    

Similar News