ముగ్గురు భామ‌లతో ప‌వ‌న్ రొమాన్స్!

Update: 2022-04-18 08:05 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో 'భ‌వ‌దీయుడు భ‌గ‌త్' సింగ్ టైటిల్ తో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.  ఈ కాంబినేష‌న్ ప్ర‌కట‌న‌తోనే అంచ‌నాలు ఆకాశన్నంట‌డం మొద‌లైంది. 'గ‌బ్బ‌ర్ సింగ్' త‌ర్వాత కాంబినేషన్ చేతులు క‌ల‌ప‌డంతో అంచ‌నాలు పీక్స్ కి చేరాయి.  ఔట్ అండ్ ఔట్ కమ‌ర్శియ‌ల్ చిత్రం.  ప‌వ‌న్ మార్క్  ఇమేజ్ తో..హ‌రీష్ శంక‌ర్ త‌న‌దైన శైలిలో తెర‌కెక్కిస్తున్నారు.ఈ విష‌యాన్ని హ‌రీష్ ఇప్ప‌టికే రివీల్ చేసారు.

అభిమానులు త‌మ  స్టార్ని ఎలా ఓన్ చేసుకుంటారో అంత‌కు మించి సినిమా ఉంటుంద‌ని ప‌బ్లిక్ గానే స్టేట్ మెంట్ ఇచ్చారు.అంటే భ‌వ‌ధీయుడు ఎంత క‌మ‌ర్శ‌యిల్ గా ఉంటాడో ఊహించొచ్చు. అతి త్వ‌ర‌లోనే సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్  ప్రారంభం కానుంది. తాజాగా సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ క‌థ‌నం ఒక‌టి వైర‌ల్ గామారింది.

ఇందులో మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉంటారుట‌. ఇప్ప‌టికే ఒక హీరోయిన్ గా  పూజా హెగ్డేని ఫైన‌ల్ చేసారు. మ‌రో ఇద్ద‌రి భామ‌ల కోసం హ‌రీష్ అన్వేష‌ణ చేస్తున్న‌ట్లు స‌మాచారం.

ఇద్ద‌రు భామ‌లు సినిమాకి ప్రెష్ ఫీల్ ని  తీసుకొచ్చేలా ఉండాల‌ని భావిస్తున్నారు. దీనిలో భాగంగా కొత్త భామ‌ల‌కి అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇక ఒక పాట‌లో ముగ్గురు భామ‌లు ప‌వ‌న్ లో క‌లిసి ఆట‌పాట‌లో ఆడనున్నారుట‌. ఆ పాట కోసం ప్ర‌త్యేకంగా సెట్ కూడా నిర్మించ‌నున్నార‌ని సోర్సెస్ ద్వారా తెలిసింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ ఓ పెప్పీ మాస్ బీట్ సాంగ్ ని  కంపోజ్ చేస్తున్నారుట‌.

ఇక ఇందులో ప‌వన్ లెక్చ‌ర‌ర్ పాత్ర‌లో  క‌నిపించ‌నున్నారుట‌. ఈనేప‌థ్యంలో కాలేజ్  ఎపిసోడ్స్  సినిమాలో హైలైట్ గా నిలుస్తాయ‌ని టాక్ వినిపిస్తుంది. ఆ ఎపిసోడ్ ల‌ను హ‌రీష్ త‌న‌దైన శైలిలో రాసుకున్నారుట‌. వాటిని చాలా వినోదాత్మ‌కంగా తెర‌కెక్కించ‌నున్నార‌ని అంటున్నారు. అదే నిజ‌మైతే 'గ‌బ్బ‌ర్ సింగ్' పోలీస్ స్టేష‌న్ సీన్ ఇమేజ్ చేసుకోవ‌చ్చు.

ఇక ఈ సినిమా షూటింగ్ ఏడాది చివ‌ర‌క‌ల్లా ప్రారంభం అయ్యే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.  మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈచిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' షూటింగ్లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సినిమా షూటింగ్  శ‌ర వేగంగా జ‌రుగుతోంది.
Tags:    

Similar News