మహేష్ బాబు కోసం 'అల్లు అర్జున్ విలన్'...?

Update: 2020-04-12 06:12 GMT
‘సరిలేరు నీకెవ్వరూ’ మూవీతో ఈ సంక్రాంతికి బ్లాక్‌ బాస్టర్ హిట్ కొట్టి 'బ్లాక్ బస్టర్ కా బాప్' అనిపించుకున్నాడు సూపర్ స్టార్ మహేష్. ఇదే ఊపులో తన నెక్స్ట్ సినిమా పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు మహేష్. ఇంతకముందు ఈ సినిమాను 'మహర్షి'లాంటి హిట్ చిత్రాన్ని అందించిన వంశీ పైడిపల్లితో ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ అది కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు తాజాగా మహేష్ తన కెరీర్ లో 27వ చిత్రంగా తెరకెక్కబోతున్న సినిమాకి 'గీతగోవిందం' ఫేమ్ పరశురామ్ దర్శకత్వం చేయబోతున్నట్లు సమాచారం.  ఈ విషయం అధికారికంగా ప్రకటించకపోయినా లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందంట. కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్న మహేష్ నెక్స్ట్ కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా కొంత డిఫరెంట్ గా ఉండేలా కొత్త తరహా కథలను ఎంచుకుంటున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ హీరోయిన్స్ కియారా అద్వానీ లేదా సారా అలీఖాన్ మహేష్ తో రొమాన్స్ చేసే అవకాశాలున్నాయని సమాచారం. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మరో న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే... ఈ సినిమాలో విలన్ గా కనిపించేది కన్నడ హీరో ఉపేంద్ర అని వార్తలు వస్తున్నాయి.

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర తెలుగు సినిమాల్లో నటించి చాలా కాలమవుతోంది. ఆయన చేసిన ప్రయోగాలు కొన్ని బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ ని అందుకున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 'కన్యాదానం - ఏ - ఉపేంద్ర - రా - రక్త కన్నీరు - స్టుపిడ్ చిత్రాలతో మన తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఇకపోతే ఆయన డైరెక్ట్ తెలుగు సినిమా చేసి చాలా కాలమవుతోంది. చివరగా s/o సత్యమూర్తి సినిమాలో స్పెషల్ పాత్రలో కనిపించిన ఉపేంద్ర ఇన్నాళ్లకు మహేష్ సినిమా ద్వారా మళ్ళీ టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రధాన విలన్ గా ఉపేంద్ర నటిస్తున్నారట. ఉపేంద్ర ఈ సినిమాలో విలన్ పాత్రకు బాగుంటాడని దర్శకుడు భావిస్తున్నాడట. కేవలం మహేష్ కోసమే ఒప్పుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. అయితే మరి ఇప్పుడు ఈ సినిమాలో ఆయన నటించబోతున్నారా లేదా నేది మాత్రం ఖచ్చితంగా తెలియదు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. లాక్ డౌన్ ముగిసిన అనంతరం పరశురామ్ - మహేష్ కొత్త సినిమాను స్టార్ట్ చేయనున్నాడు.


Tags:    

Similar News