సూపర్ స్టార్ సినిమాలో విలన్ గా మరో స్టార్!

Update: 2020-04-15 02:30 GMT
సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ బాబు ఇంతవరకు ఏ సినిమాను ప్రకటించలేదు. అయితే తాజాగా వస్తోన్న సమాచారం మేరకు గీత గోవిందంతో అదిరిపోయో హిట్ ఇచ్చిన పరుశురామ్ దర్శకత్వంలో నటిస్తున్నాడని.. ఈ సినిమా దాదాపు ఖారరైందని తెలుస్తోంది. ఇక కేవలం అధికారిక ప్రకటన మాత్రమే మిగిలివుంది. స్క్రిప్ట్ పనులు కూడా పూర్తిచేసుకున్న ఈ సినిమాలో మహేష్ సరసన ఎవరైతే బాగుంటారో అని హీరోయిన్స్ కోసం చిత్రబృందం వెతుకుతోంది. అందులో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమార్తె ‘సారా అలీ ఖాన్’ నటించబోతుందని ఓ వార్త హల్ చల్ చేయడం తెలిసిందే. అలాగే కీర్తి సురేష్ నటించబోతుందని, ఆ తరువాత కియారా అద్వానీ హీరోయిన్ గా తీసుకోబోతున్నారని ఇలా చాలా రూమర్స్ వచ్చాయి.

ఇక పరుశురామ్.. మహేష్ బాబు కోసం ఎమోషనల్ గా సాగే ఓ కమర్షియల్ ఎంటర్ టైనర్ ను సిద్ధంచేశాడట. ఇక కరోనా మహమ్మారి తగ్గి అన్ని కుదిరితే ఈ సినిమా అక్టోబర్‌లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రం గురించిన మరో ఆసక్తి వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ప్రధాన విలన్ గా కన్నడ హీరో ఉపేంద్ర నటిస్తున్నారట. ఉపేంద్ర ఈ సినిమాలో విలన్ పాత్రకు బాగుంటాడని దర్శకుడు భావిస్తున్నాడట. ఉపేంద్ర.. త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్ లో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో విలన్‌గా అదరగొట్టిన సంగతి తెలిసిందే.

ఇన్నాళ్లకు మహేష్ సినిమా ద్వారా మళ్ళీ టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఉపేంద్ర హీరోగా ఇప్పటికే కన్నడలో ఒక స్టార్ గా ఎదిగారు. ఇక ఇతర సినిమాల్లో గెస్ట్ రోల్స్ కోసం ఆయన ఎప్పుడైనా సిద్ధంగా ఉంటారు. నిజానికి మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో ఓ కీలక పాత్రకు కూడా ఇతన్ని సంప్రదించారు. అయితే అప్పుడు ఆఫర్ ను రిజెక్ట్ చేసాడట. అందుకు సంబంధించిన కారణాలు కూడా తెలీదు. అయితే ఈసారి మాత్రం ఒప్పుకుంటాడా.. అనేది మరో ప్రశ్న. చాలా మంది హీరోలతో ఉపేంద్ర కలిసి నటించారు. ఇక ఇప్పుడు మహేష్ బాబుతో కూడా స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆయన కేవలం మహేష్ కోసమే  ఒప్పుకుంటాడని టాక్. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు అయిన మే 31 న దీనికి సంబంధించి ఓ క్లారిటీ రానున్నట్టు సమాచారం.
    

Tags:    

Similar News