వర్మ సినిమాలో ఆయన జోక్యం ఎక్కువైందట!

Update: 2019-05-07 07:02 GMT
స్టార్ కిడ్స్ డెబ్యూ ఫిలిం అంటే సాధారణ సినిమాల కంటే కాస్త ఎక్కువగానే కేర్ తీసుకుంటారు. ముఖ్యంగా ఆ డెబ్యూ హీరోలకంటే తల్లిదండ్రులకు టెన్షన్ డబల్ ఉంటుంది. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విక్రమ్ అలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు. విక్రమ్  తనయుడు ధృవ్ 'ఆదిత్య వర్మ' సినిమాతో హీరోగా తమిళ చిత్రసీమకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి విక్రమ్ తెగ టెన్షన్ పడిపోతున్నాడట.

'అర్జున్ రెడ్డి' రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మొదట బాలా దర్శకత్వంలో 'వర్మ' పేరుతో తెరకెక్కించారు.  ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాతా చూసుకుంటే అవుట్ పుట్ నచ్చలేదు.  దీంతో సినిమా మొత్తాన్ని స్క్రాప్ చేసి మరోసారి ఫ్రెష్ గా 'ఆదిత్య వర్మ' టైటిల్ తో షూటింగ్ మొదలు పెట్టారు.  ఈ చిత్రానికి 'అర్జున్ రెడ్డి' డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసిన గిరీశయ్య దర్శకుడు.  అయితే మొదటిసారి అవుట్ పుట్ తేడాగా రావడంతో ఈసారి విక్రమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఒక కంట కనిపెడుతున్నాడట.  రీసెంట్ గా 'ఆదిత్య వర్మ' టీమ్ పోర్చుగల్ కు వెళ్ళిన సమయంలో విక్రమ్ కూడా వారితో పాటు వెళ్ళి షూటింగ్ ఎలా సాగుతుందో గమనించాడట.  అంతే కాదు ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ డెహ్రాడూన్ లో జరగనుంది.. ఈ షెడ్యూల్ కూడా విక్రమ్ కనుసన్నలల్లోనే జరగనుందట.

కొడుకుపై ప్రేమతో ఇలా సినిమాలో మితిమీరి జోక్యం చేసుకోవడం ఫైనల్ గా మంచి చేస్తుందా లేదా చేటు చేస్తుందా అనేది ఈ సినిమా టీజర్ ట్రైలర్ లు రిలీజ్ అయితే కానీ తెలీదు. ఈసారి నెగెటివ్ రెస్పాన్స్ వస్తే మాత్రం అందరి వేళ్ళు విక్రమ్ వైపు చూపిస్తాయనడంలో సందేహం లేదు.  
    

Tags:    

Similar News