రాజమౌళి పేరు ఇప్పుడు దేశ్యాప్తంగా వ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది. `బాహుబలి` విజయంతో పాన్ ఇండియా డైరెక్టర్ గా ఫేమస్ అయ్యారు. ఇప్పుడా ఆయన తెరకెక్కించిన `ఆర్ ఆర్ ఆర్` కూడా సక్సెస్ అయితే ఆ ఇమేజ్ రెట్టింపు అవుతుంది. వసూళ్ల పరంగా `బాహుబలి`.. బాలీవుడ్ `దంగల్` సినిమా రికార్డులను సైతం బ్రేక్ చేయగల్గితే దేశంలోనే నెంబర్ -1 దర్శకుడిగా జక్కన్న వెలిగిపోతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
`బాహుబలి ` సక్సెస్ తోనే బాలీవుడ్ దిగ్గజ హీరోలు అతనితో పనిచేయాలని ఉత్సహం చూపిస్తున్నారు. ఈ విషయాన్ని మిస్టర్ పర్ పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోనే తన మనసులో మాటని బయటపెట్టారు. అలాంటి దిగ్ధదర్శకుడు ఖ్యాతి గురించి చెప్పేదేముంటుంది. కేవలం ఆయన క్రియేటివ్ రంగాన్ని ఎంచుకోవడంతోనే ఇదంతా సాధ్యమైంది. మరో రంగమో..సినిమాలో మేకర్ గా కాకుండా ఇతర శాఖనో ఎంచుకుంటే `బాహుబలి` లాంటి సినిమాలు వచ్చేవి కాదేమో.
అవును ఆఛాన్స్ కూడా తృటిలో తప్పినట్లే కనిపిస్తుంది. `ఆర్ ఆర్ ఆర్` ప్రమోషన్ లో భాగంగా జక్కన్న కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో తారక్-జక్కన్న మధ్య ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది. ఇద్దరూ నేను అంటే నేను సీనియర్ అని కాసేపు వాదించుకున్నారు. నువ్వు సినిమాల్లోకి రాకముందే నేను సీరియల్ డైరెక్టర్ అని రాజమౌళి అంటారు. దానికి బధులుగా అంతకంటే ముందే నేను బాలనటుడిగా సినిమాలు చేసాను అని ఎన్టీఆర్ కౌంటర్ వేసారు.
ఆ వెంటనే రాజమౌళి నీకంటే నేను నటుడిగా ముందే మేకప్ వేసుకున్నాను. 1983 లోనే `పిల్లన గ్రోవి` అనే సినిమాలో బాల నటుడిగా నటించాను. కానీ ఆ సినిమా విడుదల కాలేదు. ఆ సినిమా రిలీజ్ అయి సక్సెస్ అయితే కెరీర్ మరోలా ఉండేదేమోనని అభిప్రాయపడ్డారు. దీంతో తారక్ షాక్ అయ్యాడు. ఏంటి నువ్వు నాకన్నా సీనియర్ వా? అంటూ ఓ ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు.
నిజంగా జక్కన్న అన్నట్లు సినిమా రిలీజ్ అయితే ఆయన నటుడిగా కొనసాగేవారేమో! అదే జరిగితే `బాహుబలి` లాంటి సినిమాలు వచ్చేవి కాదు. నటుడిగా...హీరోగా రాజమౌళి బిజీ అయ్యేవారు. అతని కెరీర్ జర్నీ కొత్త కోణంలో సాగేది. కారణాలు ఏవైనా జక్కన్న హీరో కాకపోవడంలో వల్లే `బాహుబలి`.. `ఆర్ ఆర్ ఆర్` లాంటి చిత్రాలు తెరపైకి వచ్చాయి. పాన్ ఇండియా హీరోల్ని ఆవిష్కరించ గల్గుతున్నారు. విజయేంద్ర ప్రసాద్ లాంటి స్టార్ రైటర్ కథలకు మార్కెట్ లో డిమాండ్ పెరిగింది. స్టార్ రైటర్ సృజనాత్మకతకి దృశ్యరూపం దొరికింది.
ఇక `ఆర్ ఆర్ ఆర్` తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో ఆప్రికన్ అడవుల నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ఇది మారో పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం కానుంది. ఇప్పటికే సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతోన్న సంగతి తెలిసిందే. ఈసినిమాలో మహేష్ ని సరికొత్త కోణంలో ఆవిష్కరించనున్నారు.
`బాహుబలి ` సక్సెస్ తోనే బాలీవుడ్ దిగ్గజ హీరోలు అతనితో పనిచేయాలని ఉత్సహం చూపిస్తున్నారు. ఈ విషయాన్ని మిస్టర్ పర్ పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోనే తన మనసులో మాటని బయటపెట్టారు. అలాంటి దిగ్ధదర్శకుడు ఖ్యాతి గురించి చెప్పేదేముంటుంది. కేవలం ఆయన క్రియేటివ్ రంగాన్ని ఎంచుకోవడంతోనే ఇదంతా సాధ్యమైంది. మరో రంగమో..సినిమాలో మేకర్ గా కాకుండా ఇతర శాఖనో ఎంచుకుంటే `బాహుబలి` లాంటి సినిమాలు వచ్చేవి కాదేమో.
అవును ఆఛాన్స్ కూడా తృటిలో తప్పినట్లే కనిపిస్తుంది. `ఆర్ ఆర్ ఆర్` ప్రమోషన్ లో భాగంగా జక్కన్న కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో తారక్-జక్కన్న మధ్య ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది. ఇద్దరూ నేను అంటే నేను సీనియర్ అని కాసేపు వాదించుకున్నారు. నువ్వు సినిమాల్లోకి రాకముందే నేను సీరియల్ డైరెక్టర్ అని రాజమౌళి అంటారు. దానికి బధులుగా అంతకంటే ముందే నేను బాలనటుడిగా సినిమాలు చేసాను అని ఎన్టీఆర్ కౌంటర్ వేసారు.
ఆ వెంటనే రాజమౌళి నీకంటే నేను నటుడిగా ముందే మేకప్ వేసుకున్నాను. 1983 లోనే `పిల్లన గ్రోవి` అనే సినిమాలో బాల నటుడిగా నటించాను. కానీ ఆ సినిమా విడుదల కాలేదు. ఆ సినిమా రిలీజ్ అయి సక్సెస్ అయితే కెరీర్ మరోలా ఉండేదేమోనని అభిప్రాయపడ్డారు. దీంతో తారక్ షాక్ అయ్యాడు. ఏంటి నువ్వు నాకన్నా సీనియర్ వా? అంటూ ఓ ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు.
నిజంగా జక్కన్న అన్నట్లు సినిమా రిలీజ్ అయితే ఆయన నటుడిగా కొనసాగేవారేమో! అదే జరిగితే `బాహుబలి` లాంటి సినిమాలు వచ్చేవి కాదు. నటుడిగా...హీరోగా రాజమౌళి బిజీ అయ్యేవారు. అతని కెరీర్ జర్నీ కొత్త కోణంలో సాగేది. కారణాలు ఏవైనా జక్కన్న హీరో కాకపోవడంలో వల్లే `బాహుబలి`.. `ఆర్ ఆర్ ఆర్` లాంటి చిత్రాలు తెరపైకి వచ్చాయి. పాన్ ఇండియా హీరోల్ని ఆవిష్కరించ గల్గుతున్నారు. విజయేంద్ర ప్రసాద్ లాంటి స్టార్ రైటర్ కథలకు మార్కెట్ లో డిమాండ్ పెరిగింది. స్టార్ రైటర్ సృజనాత్మకతకి దృశ్యరూపం దొరికింది.
ఇక `ఆర్ ఆర్ ఆర్` తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో ఆప్రికన్ అడవుల నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ఇది మారో పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం కానుంది. ఇప్పటికే సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతోన్న సంగతి తెలిసిందే. ఈసినిమాలో మహేష్ ని సరికొత్త కోణంలో ఆవిష్కరించనున్నారు.